
will madhuri escape death in janaki kalaganaledu
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 7 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 426 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మాధురిని ఆసుపత్రిలో చేర్పించిన జానకి వాళ్ల పేరెంట్స్ కు ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. దీంతో వాళ్లు కంగారు పడుతూ ఆసుపత్రికి వస్తారు. ఓ వ్యక్తి మాధురి తల మీద కొట్టాడని చెబుతుంది. ట్రీట్ మెంట్ జరుగుతోందని చెబుతుంది. డాక్టర్లు కూడా మాధురి బతకడం కష్టం అని చెబుతారు. అసలు అఖిల్ ఎందుకిలా చేశాడు. ముందు అఖిల్ ను ఎందుకు ఇలా చేశాడో అడిగి తెలుసుకొని ఆ తర్వాత ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని అనుకుంటుంది.
will madhuri escape death in janaki kalaganaledu
మరోవైపు రాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదని ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఫోన్ చేసినా కూడా తీయడం లేదని రామా చెబుతాడు. దీంతో ఇంట్లో వాళ్లకు టెన్షన్ ఇంకా ఎక్కువవుతుంది. ఇంతలో జానకి వస్తుంది. తను దీనంగా ఉండటం చూసి రామా షాక్ అవుతాడు. ఏమైంది జానకి ఎందుకు లేట్ అయింది అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో స్టడీ మెటీరియల్ కొనడానికి వెళ్లినందుకు లేట్ అయింది. లేట్ అవుతుందని చెప్పనందుకు సారీ అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది జానకి. ఆ తర్వాత రామా రూమ్ లోకి వెళ్లి ఏమైంది జానకి గారు. ఎందుకు అంత డల్ గా ఉన్నారు అని అడుగుతాడు. దీంతో ఏం లేదు అంటుంది జానకి.
కానీ.. రామాకు మాత్రం ఏదో అనుమానం వస్తుంది. ఇప్పుడే రామా గారికి మాధురి విషయం చెప్పాలా వద్దా అని అనుకుంటుంది జానకి. అసలు అఖిల్ తో మాట్లాడాక ఏం జరిగిందో అప్పుడు అర్థం అవుతుంది. ఆ తర్వాతే అందరికీ చెప్పాలి అని అనుకుంటుంది జానకి.
మరోవైపు అఖిల్.. మాధురిని తను చంపేసిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మంచోడిలా చదువుతున్నట్టు నటిస్తాడు. పుస్తకాలు పట్టుకొని చదువుకోవడానికి వెళ్లబోతాడు. ఇంతలో అక్కడికి జెస్సీ వస్తుంది.
ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది జెస్సీ. దీంతో చదువుకోవడానికి. నేను మారాను అంటాడు. దీంతో జెస్సీ సంతోషిస్తుంది. ఇంతలో జానకి అవన్నీ వింటుంది. ఓవైపు మాధురిని ఆసుపత్రిలో చేరేలా చేసి ఇక్కడ మంచోడిలా నటిస్తున్నాడు అని అనుకుంటుంది.
అఖిల్ దగ్గరికి వెళ్లిన జానకి.. ఏమైంది అఖిల్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది జానకి. దీంతో చదువుకుంటాను ఇక. బాధ్యతగా ఉంటాను వదిన అంటాడు అఖిల్. దీంతో అఖిల్ తో మాధురి గురించి మాట్లాడాలని అనుకొని జెస్సీని అఖిల్ కు చాయ్ పెట్టు అని అక్కడి నుంచి కిచెన్ లోకి పంపిస్తుంది.
జెస్సీ వెళ్లాక అఖిల్ తో నీకోసం ఎవరో వచ్చారు. బయట వెయిట్ చేస్తున్నారు అని అంటుంది జానకి. దీంతో మాధురి విషయం ఎవరికైనా తెలిసిందా అని టెన్షన్ పడుతూ బయటికి వెళ్తాడు. కానీ.. అక్కడ ఎవరూ ఉండరు. దీంతో షాక్ అవుతాడు అఖిల్.
ఇంతలో బయటికి వచ్చిన జానకి నీకోసం ఎవరూ రాలేదు అంటుంది. మాధురి ఎవరు అని అడుగుతుంది. మాధురిని ఎందుకు అలా కొట్టావు అని అడగడంతో అఖిల్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
New Houses : ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Gold Silver Rate 8th April 2026 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది కచ్చితంగా…
Karthika Deepam 2 April 8th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్లో ప్రసారం అవుతున్న…
Kissing Disease : ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పిన మాటకు కొత్త అర్థం ఇస్తున్నాయి తాజా వైద్య పరిశోధనలు.…
Chanakyaniti : ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవన విధానం గురించి అలాగే కుటుంబం ఎలా ఉండాలి…
zodiac : ఏప్రిల్ 17న ఏర్పడుతున్న అక్షతి అమావాస్య జ్యోతిష్య పరంగా ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు గ్రహాల స్థాన…
Ajit Doval : ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో భారత్ మరియు రష్యా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.…
Trisha : దక్షిణాది చిత్రసీమతో పాటు జాతీయ మీడియా, సోషల్ మీడియాలో సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు ఇటీవలి…
Police Academy : దేశంలోని ప్రముఖ పోలీస్ శిక్షణ సంస్థల్లో ఒకటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ…
kashmir Modi : భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత సవాళ్లలో నక్సలిజం మరియు జమ్మూ కాశ్మీర్ సమస్యలు దశాబ్దాలుగా మానిపోని…
Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా…
This website uses cookies.