will madhuri escape death in janaki kalaganaledu
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 7 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 426 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మాధురిని ఆసుపత్రిలో చేర్పించిన జానకి వాళ్ల పేరెంట్స్ కు ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. దీంతో వాళ్లు కంగారు పడుతూ ఆసుపత్రికి వస్తారు. ఓ వ్యక్తి మాధురి తల మీద కొట్టాడని చెబుతుంది. ట్రీట్ మెంట్ జరుగుతోందని చెబుతుంది. డాక్టర్లు కూడా మాధురి బతకడం కష్టం అని చెబుతారు. అసలు అఖిల్ ఎందుకిలా చేశాడు. ముందు అఖిల్ ను ఎందుకు ఇలా చేశాడో అడిగి తెలుసుకొని ఆ తర్వాత ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని అనుకుంటుంది.
will madhuri escape death in janaki kalaganaledu
మరోవైపు రాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదని ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఫోన్ చేసినా కూడా తీయడం లేదని రామా చెబుతాడు. దీంతో ఇంట్లో వాళ్లకు టెన్షన్ ఇంకా ఎక్కువవుతుంది. ఇంతలో జానకి వస్తుంది. తను దీనంగా ఉండటం చూసి రామా షాక్ అవుతాడు. ఏమైంది జానకి ఎందుకు లేట్ అయింది అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో స్టడీ మెటీరియల్ కొనడానికి వెళ్లినందుకు లేట్ అయింది. లేట్ అవుతుందని చెప్పనందుకు సారీ అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది జానకి. ఆ తర్వాత రామా రూమ్ లోకి వెళ్లి ఏమైంది జానకి గారు. ఎందుకు అంత డల్ గా ఉన్నారు అని అడుగుతాడు. దీంతో ఏం లేదు అంటుంది జానకి.
కానీ.. రామాకు మాత్రం ఏదో అనుమానం వస్తుంది. ఇప్పుడే రామా గారికి మాధురి విషయం చెప్పాలా వద్దా అని అనుకుంటుంది జానకి. అసలు అఖిల్ తో మాట్లాడాక ఏం జరిగిందో అప్పుడు అర్థం అవుతుంది. ఆ తర్వాతే అందరికీ చెప్పాలి అని అనుకుంటుంది జానకి.
మరోవైపు అఖిల్.. మాధురిని తను చంపేసిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మంచోడిలా చదువుతున్నట్టు నటిస్తాడు. పుస్తకాలు పట్టుకొని చదువుకోవడానికి వెళ్లబోతాడు. ఇంతలో అక్కడికి జెస్సీ వస్తుంది.
ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది జెస్సీ. దీంతో చదువుకోవడానికి. నేను మారాను అంటాడు. దీంతో జెస్సీ సంతోషిస్తుంది. ఇంతలో జానకి అవన్నీ వింటుంది. ఓవైపు మాధురిని ఆసుపత్రిలో చేరేలా చేసి ఇక్కడ మంచోడిలా నటిస్తున్నాడు అని అనుకుంటుంది.
అఖిల్ దగ్గరికి వెళ్లిన జానకి.. ఏమైంది అఖిల్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది జానకి. దీంతో చదువుకుంటాను ఇక. బాధ్యతగా ఉంటాను వదిన అంటాడు అఖిల్. దీంతో అఖిల్ తో మాధురి గురించి మాట్లాడాలని అనుకొని జెస్సీని అఖిల్ కు చాయ్ పెట్టు అని అక్కడి నుంచి కిచెన్ లోకి పంపిస్తుంది.
జెస్సీ వెళ్లాక అఖిల్ తో నీకోసం ఎవరో వచ్చారు. బయట వెయిట్ చేస్తున్నారు అని అంటుంది జానకి. దీంతో మాధురి విషయం ఎవరికైనా తెలిసిందా అని టెన్షన్ పడుతూ బయటికి వెళ్తాడు. కానీ.. అక్కడ ఎవరూ ఉండరు. దీంతో షాక్ అవుతాడు అఖిల్.
ఇంతలో బయటికి వచ్చిన జానకి నీకోసం ఎవరూ రాలేదు అంటుంది. మాధురి ఎవరు అని అడుగుతుంది. మాధురిని ఎందుకు అలా కొట్టావు అని అడగడంతో అఖిల్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
This website uses cookies.