Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 4 ఏప్రిల్ 2022, 270 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబకు కావాలని అన్నీ ఎక్కించి చెబుతుంది మల్లిక. తన ఫ్రెండ్ వచ్చినప్పుడు రామాకు విడాకులు ఇస్తా అని తనతో అనడం నేను విన్నా అని జ్ఞానాంబకు మల్లిక చెప్పడంతో జ్ఞానాంబ కూడా నిజమే అని నమ్ముతుంది. చదువుకున్నానన్న తెలివి తనలో బాగానే ఉంది కదా. రామా కూడా చదువుకోలేదు. అందుకే.. రామాకు విడాకులు ఇవ్వడానికి జానకి సిద్ధపడటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అని అంటుంది జ్ఞానాంబ.
ఆ తర్వాత దండం విషయంలో మల్లిక, జానకి మధ్య గొడవ జరుగుతుంది. జానకి.. దండం మీద తన బట్టలు ఆరేసి వెళ్లగా.. మల్లిక వచ్చి వాళ్ల బట్టలను తీసి కింద పడేస్తుంది. తన బట్టలను ఆ దండం మీద ఆరేసుకుంటూ.. జానకిని విమర్శిస్తుంది. ఇక్కడ ఉండకండి అని చెప్పినా కూడా ఇంకా ఇక్కడే ఉండటం, కనిపించడం ఏంటో. అమ్మో నేనైతే ఒక్క క్షణం కూడా ఉండేదాన్ని కాదు అని అంటుంది మల్లిక. ఇదంతా చూసిన గోవిందరాజు.. వెంటనే వెళ్లి ఒక తాడును తీసుకొచ్చి దండం అక్కడ కట్టి ఇక నుంచి ఇక్కడ నువ్వు బట్టలు ఆరేసుకో అని చెప్పి.. ఆ బట్టలను తీసి ఆరేస్తాడు గోవింద రాజు.
థాంక్యూ మామయ్య గారు అంటుంది జానకి. ఆ తర్వాత డబ్బులు తీసుకో అంటాడు. వద్దు అంటుంది. కొడుకు కష్టాల్లో ఉన్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత తండ్రిగా నాకుందని రామాకు చెబుతానులే.. తీసుకో అంటాడు. నువ్వు తీసుకోకపోతే నేను బాధపడతాను అంటాడు.
ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. తనను చూసి షాక్ అవుతాడు. దీంతో ఇదిగో మీ బట్టలు మీ దండం మీద ఆరేసుకోవాలి. మా దండం మీద ఆరేయకూడదు. ఇదిగో అర్థం అయిందా. మా దండం మీద ఆరేస్తే నేను ఊరుకోను.. అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు గోవిందరాజు.
మరోవైపు ఖార్ఖానాలో అన్నం తినకుండా దాన్ని పడేసి తీసుకొచ్చిన రామాను చూసి బాధపడుతుంది జ్ఞానాంబ. నా కొడుకు ఎన్ని కష్టాలు పడుతున్నాడు. వాడిని ఎలా పెంచుకున్నాను. ఇప్పుడు వాడి బతుకు ఎలా అయింది అని చాలా బాధపడుతుంది జ్ఞానాంబ.
రామా ఇలా కడుపు కాల్చుకునే పరిస్థితి రావడానికి.. నాకు కన్నపేగు బాధపడటానికి కారణం ఆ ఒక్క జానకే అని అనుకుంటుంది జ్ఞానాంబ. చివరకు రాత్రి కూడా రామాతో జానకి చపాతీలు చేయించడం చూసి షాక్ అవుతుంది జ్ఞానాంబ.
కానీ.. రామా మాత్రం.. రాత్రి పూట చపాతీలు కాల్చుతూ తన పాత మెమోరీస్ ను గుర్తు తెచ్చుకుంటాడు. తెల్లారాక.. ఖార్ఖానాలో భోజనం చేస్తూ జానకికి ఫోన్ చేస్తాడు. ఈరోజు భోజనం అదిరిపోయింది అని చెబుతాడు. కానీ.. ఆ భోజనాన్ని పంపించింది జానకి కాదు.. జ్ఞానాంబ.
అందుకే.. భోజనం అచ్చం మా అమ్మ చేసిన దానిలా ఉందంటాడు. ఇదంతా అక్కడే ఉండి చూసిన జ్ఞానాంబ.. నాకు తెలుసు రామా.. నువ్వు ఈ అమ్మకు సంబంధించిన దాన్ని ఇట్టే గుర్తుపడతావని. మనిద్దరి మధ్య బంధం దూరం అవ్వడానికి కారణం ఆ జానకి అని అనుకుంటుంది జ్ఞానాంబ.
రానివ్వను నాన్నా.. నా కొడుకుకు అలాంటి పరిస్థితి రానివ్వను. చూస్తూ చూస్తూ… నిన్ను దూరం చేసుకోను. కాపాడుకుంటాను… అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.