
Harmful Food : చేపలు తినేవారు ఈ రెండిటితో కలిపి తినకండి... ప్రమాదం తప్పదు...!
Harmful Food : ఇంట్లో అందరూ ఒకే అభిరుచులు కలిగి ఉండరు. కొంతమందికి వేపుడు అంటే ఇష్టం ఇంకొందరికి పులుసు అంటే ఇష్టం.. మరికొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు.. మరికొందరికి అయితే సీ ఫుడ్స్ ఉంటేనే భోంచేస్తారు. ఇలా ఇంట్లోనే రకరకాల రుచి కలిగిన వాళ్ళు ఉంటూ ఉంటారు. అభిరుచులు ఎలా ఉన్నాగాని మన శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చే ఫుడ్స్ ని తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్.. ఇష్టమైన ఫుడ్ని అదే పనిగా తిన్నా కూడా అనర్ధాలే అందుకని మన శరీరానికి కావలసిన పోషకాలు అందే ఆహారాన్ని సక్రమంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా కావాలి అంటే అవి చేపల్లోనే మనకు లభ్యమవుతాయి. కాబట్టి వారంలో రెండు సార్లు చేపలు తింటే మంచిదని దానివల్ల గుండె జబ్బులు రావని అమెరికన్ హాట్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధన వెల్లడించింది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాలను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. చేపలను తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. వారంలో రెండు సార్లు మొత్తం కలిపి 100 గ్రాముల వరకు ఉడకబెట్టిన లేదా గ్రిల్ చేసిన చేపలను తింటే గుండెజబ్బులు రాకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. చేపలు మనం ఎలా తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా.. మరైతే చేపలతో కలిపి తినకూడని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అలా తింటే ఎన్ని అనర్ధాలు వస్తాయి.
పూర్తి వివరాలు తెలుసుకుందాం. చేపలను తరచూ తింటుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. గుండె సమస్యలు ఉన్నవారు తరుచూ చేపలను తీసుకుంటే మంచిది. చేపలను తరుచూ తినేవారిలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ వస్తుంది. డయాబెటిస్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వారి మెదడు బాగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చేపలు ఎలా పడితే అలా తినకూడదు. మరి ఏ ఆహారం పడితే ఆహారంతో కలిపి తినకూడదు. అలా తినడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.. చేపలతో మీరు భోజనం ముగించిన తర్వాత వెంటనే పాలను తాగకండి. అంటే భోజనమైన తర్వాత రాత్రి వేళలో కొంతమంది పాలు తాగి పడుకోవడం అలవాటు ఉంటుంది కదా.. అటువంటి వాళ్ళు చేపలతో కనుక భోజనం చేస్తే ఆ రోజు పాలను తాగకండి. అంటే వెంటనే తాగకండి కొంత సమయం ఒక గంట గ్యాప్ ఇచ్చిన తాగాలి. లేదంటే పూర్తిగా అవాయిడ్ చేయడం కూడా మంచిది.
ఎందుకంటే పాలు మన బాడీకి కూల్చేస్తాయి. . ఈ రెండింటి మిశ్రమం మన శరీరంలో రక్తప్రసరణ పై ప్రభావం చూస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తినకండి. కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో ఉడికించిన గుడ్లు అలాగే చేపలు తినడం అలవాటు చేసుకుంటారు. నిజానికి గుడ్లు చేపల్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిపి తినడం వల్ల అరుగుదల శక్తి మందగిస్తుంది. మీరు తిన్న ఆహారం చాలా ఎక్కువ సేపు అరగడానికి టైం తీసుకుంటుంది.కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు కలిపి తినకండి. అలాగే పెరుగు చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంటే మీరు చేపలతో భోజనం చేసిన తర్వాత తినకండి.. కొంతమందికి పెరుగుతో భోజనాన్ని ముగించడం అలవాటు కదా..
అలా మీ అలవాటును చేపల కూర తీసుకున్నప్పుడు మాత్రం అవాయిడ్ చేయండి. అయితే ఈ రెండు ప్రోటీన్ల మధ్య వ్యత్యాసం ఉందని కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు. రెండింటిలోనూ వివిధ రకాల ప్రోటీన్లు ఉంటాయి.అందువల్ల పెరుగు చేపలను కలిపి తింటే జీర్ణక్రియలో సమస్య ఏర్పడుతుంది. ఎన్ని అనర్ధాలు ఉన్నాయో చూశారు కదా.. కాబట్టి డాక్టర్ సలహా మేరకు వారానికి రెండు సార్లు గాని లేదా మీ పర్సనల్ డాక్టర్ సూచించిన ప్రకారం మీ డైట్ లో చేపలను కచ్చితంగా చేర్చుకోండి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేపల ద్వారా మనకు అందుతాయి..
Teerdham in a Temple : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా ఈ టెక్నాలజీ…
World Largest Tree: ప్రకృతిలో మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో వింతలు ఉన్నాయి. అందులో ఒకటి కాలిఫోర్నియాలోని సీక్వోయా నేషనల్ పార్క్…
iPhone 17e Review: యాపిల్ నుంచి రాబోతున్న కొత్త ఫోన్ గురించి టెక్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే…
PM-Kisan : దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్…
Farmer : రైతులకు గుడ్ న్యూస్ .. అతి తక్కువ వడ్డీతో రూ.3 లక్షలు అందిస్తున్న కేంద్రం : దేశంలోని…
Gold Rates Today 16 February 2026: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. గత…
Brahmamudi 2026 February 16th Episode: బ్రహ్మముడి 2026 ఫిబ్రవరి 16 ఎపిసోడ్: స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్…
Karthika Deepam 2 February 16th 2026 Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'కార్తీక…
This website uses cookies.