
Drink Water : నిలబడి నీళ్లు త్రాగవచ్చా... త్రా గితే నిజంగా మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు వస్తాయా...!!
Drink Water : ప్రస్తుతం మనలో చాలా మందికి కూడా నిలబడి నీళ్లు తాగటం ఒక అలవాటు. వాస్తవానికి నిలబడి నీళ్లు తాగటం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. దీని వలన జరిగే అనర్ధాలలో ఒకటి మోకాళ్ళ నొప్పులు రావటం. అందువలన నీరు లేక ఏదైనా ద్రవాన్ని నిలబడి తాగకూడదు, కూర్చొనే తాగాలి అని మన చుట్టూ ఉన్నటువంటి వారు చెబుతూ ఉంటారు. నిలబడి నీళ్లు తాగటం వలన జీర్ణక్రియ అనేది చెడిపోయి ఆహారం అనేది జీర్ణం కావడానికి ఎంతో కష్టం అవుతుంది. దీనివలన మలబద్ధక సమస్య అనేది వస్తుంది అనే అపోహలు కూడా ఉన్నాయి. అంతేకాక నీళ్ల ను నిలబడి తాగటం వలన తీవ్రమైన కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి అని ఎవరో ఒకరు నోటి వెంట మనం వింటూనే ఉంటాం. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడి నీళ్లను తాగకూడదు. నీళ్లను నిలబడి తాగటం వలన కీళ్ల నొప్పుల సమస్యలు వస్తాయని,అంతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చాలామంది అంటున్నారు. అంతేకాక నిలబడి నీళ్లు తాగటం వలన దాహం అనేది తీరదు. అలాగే పదే పదే దాహం వేస్తుంది అని జనాలు అంటున్నారు. అసలు ఇంతకీ వీటికి సంబంధించినటువంటి ICMR ఏమి చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మన దేశంలో ఉన్న అతిపెద్ద వైద్య పరిశోధన సంస్థ అయినా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ త్రాగునీటికి సంబంధించి సమాచారాన్ని ప్రస్తుతం నివేదిక రూపంలో రిలీజ్ చేసింది. నిలబడి నీరు తీసుకోవడం వలన కాళ్ళ కు మరియు శరీరానికి హాని కలుగుతుంది అనటానికి ఎలాంటి రుజువు అనేది లేనేలేదు. కావున దీనికి సంబంధించి ఖచ్చితమైన నిజాలు, ఆధారాలు అనేవి ఇంతవరకు కూడా ఏ పరిశోధనలో బయటపడలేదు. అందుకే నిలబడి లేక కూర్చొని ఎలా నీరు త్రాగిన సరే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు అని ICMR తెలిపింది.
Drink Water : నిలబడి నీళ్లు త్రాగవచ్చా… త్రా గితే నిజంగా మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు వస్తాయా…!!
నిపుణులు ఏమంటున్నారంటే : ఢిల్లీలోనే సప్డ్ ర్ హాస్పటల్ లోని మెడిసిన్ విభాగం హెచ్ ఓ డి ప్రొఫెసర్ డాక్టర్ జూగల్ కిషోర్ దీని గురించి మాట్లాడుతూ, నిలబడే నీరు త్రాగటం వలన హాని కలుగుతుంది అనేది ఏ శాస్త్రీయ పరిశోధనలో తెలపలేదు. తాజాగా ICMR కూడా నీటిని ఏ విధంగానైనా తాగవచ్చు అని ధృవీకరించింది. నీళ్లను నిలబడి త్రాగకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే. ఈ సమస్యలు అన్ని నిలబడి నీరు త్రాగటం వలన వస్తాయి అని, అలాగే నిలబడి నీళ్లు త్రాగటానికి మరియు శరీరంలోని వ్యాధులకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదు అని తెలిపారు. అందుకే నిలబడి లేక కూర్చొని నీరు ఏ విధంగా త్రాగినా సరే ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు.
ప్రతినిత్యం పుష్కలంగా నీరు త్రాగాలి అనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రతినిత్యం కూడా 8 నుండి 10 గ్లాసుల నీరు తప్పకుండా తీసుకోవాలి. వేసవిలో మాత్రం నీళ్ళ ని ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది…
Pomegranate Juice : “ఒక దానిమ్మ పండు వంద వ్యాధులను నయం చేస్తుంది” అనే సామెత మనకు తెలిసిందే. అయితే…
Chanakya Niti : వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆచార్య చాణక్యుడు ప్రతిపాదించిన జీవన విధానాలు, వ్యూహాలు నేటి ఆధునిక…
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
This website uses cookies.