Drink Water : నిలబడి నీళ్లు త్రాగవచ్చా... త్రా గితే నిజంగా మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు వస్తాయా...!!
Drink Water : ప్రస్తుతం మనలో చాలా మందికి కూడా నిలబడి నీళ్లు తాగటం ఒక అలవాటు. వాస్తవానికి నిలబడి నీళ్లు తాగటం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. దీని వలన జరిగే అనర్ధాలలో ఒకటి మోకాళ్ళ నొప్పులు రావటం. అందువలన నీరు లేక ఏదైనా ద్రవాన్ని నిలబడి తాగకూడదు, కూర్చొనే తాగాలి అని మన చుట్టూ ఉన్నటువంటి వారు చెబుతూ ఉంటారు. నిలబడి నీళ్లు తాగటం వలన జీర్ణక్రియ అనేది చెడిపోయి ఆహారం అనేది జీర్ణం కావడానికి ఎంతో కష్టం అవుతుంది. దీనివలన మలబద్ధక సమస్య అనేది వస్తుంది అనే అపోహలు కూడా ఉన్నాయి. అంతేకాక నీళ్ల ను నిలబడి తాగటం వలన తీవ్రమైన కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి అని ఎవరో ఒకరు నోటి వెంట మనం వింటూనే ఉంటాం. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడి నీళ్లను తాగకూడదు. నీళ్లను నిలబడి తాగటం వలన కీళ్ల నొప్పుల సమస్యలు వస్తాయని,అంతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చాలామంది అంటున్నారు. అంతేకాక నిలబడి నీళ్లు తాగటం వలన దాహం అనేది తీరదు. అలాగే పదే పదే దాహం వేస్తుంది అని జనాలు అంటున్నారు. అసలు ఇంతకీ వీటికి సంబంధించినటువంటి ICMR ఏమి చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మన దేశంలో ఉన్న అతిపెద్ద వైద్య పరిశోధన సంస్థ అయినా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ త్రాగునీటికి సంబంధించి సమాచారాన్ని ప్రస్తుతం నివేదిక రూపంలో రిలీజ్ చేసింది. నిలబడి నీరు తీసుకోవడం వలన కాళ్ళ కు మరియు శరీరానికి హాని కలుగుతుంది అనటానికి ఎలాంటి రుజువు అనేది లేనేలేదు. కావున దీనికి సంబంధించి ఖచ్చితమైన నిజాలు, ఆధారాలు అనేవి ఇంతవరకు కూడా ఏ పరిశోధనలో బయటపడలేదు. అందుకే నిలబడి లేక కూర్చొని ఎలా నీరు త్రాగిన సరే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు అని ICMR తెలిపింది.
Drink Water : నిలబడి నీళ్లు త్రాగవచ్చా… త్రా గితే నిజంగా మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు వస్తాయా…!!
నిపుణులు ఏమంటున్నారంటే : ఢిల్లీలోనే సప్డ్ ర్ హాస్పటల్ లోని మెడిసిన్ విభాగం హెచ్ ఓ డి ప్రొఫెసర్ డాక్టర్ జూగల్ కిషోర్ దీని గురించి మాట్లాడుతూ, నిలబడే నీరు త్రాగటం వలన హాని కలుగుతుంది అనేది ఏ శాస్త్రీయ పరిశోధనలో తెలపలేదు. తాజాగా ICMR కూడా నీటిని ఏ విధంగానైనా తాగవచ్చు అని ధృవీకరించింది. నీళ్లను నిలబడి త్రాగకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే. ఈ సమస్యలు అన్ని నిలబడి నీరు త్రాగటం వలన వస్తాయి అని, అలాగే నిలబడి నీళ్లు త్రాగటానికి మరియు శరీరంలోని వ్యాధులకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదు అని తెలిపారు. అందుకే నిలబడి లేక కూర్చొని నీరు ఏ విధంగా త్రాగినా సరే ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు.
ప్రతినిత్యం పుష్కలంగా నీరు త్రాగాలి అనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రతినిత్యం కూడా 8 నుండి 10 గ్లాసుల నీరు తప్పకుండా తీసుకోవాలి. వేసవిలో మాత్రం నీళ్ళ ని ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…
Wife Husband : జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్కు చెందిన బింగి రాజశేఖర్ తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్ వ్యక్తితో సంబంధం…
This website uses cookies.