Home » Health » Good News For Diabetic Patients
Health

Diabetes Medicine : షుగర్ పేషెంట్లకు ఊరటనిచ్చే శుభవార్త .. భారీగా తగ్గిన డయాబెటిస్ మెడిసిన్ ధర ..!

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Updated on: March 25, 2026 2:28 pm
Advertisement

Diabetes Medicine : బరువు తగ్గాలని ఆశపడుతున్నవారికి, షుగర్ సమస్యతో బాధపడుతున్నవారికి ఊరటనిచ్చే శుభవార్త అందింది. ఇప్పటి వరకు అధిక ధరల కారణంగా చాలా మందికి అందని ద్రవ్యంగా భావించిన ‘సెమాగ్లుటైడ్’ ఔషధం ఇప్పుడు తక్కువ ధరలకు లభించనుంది. గతంలో నెలకు రూ.10,000 నుంచి రూ.16,000 వరకు ఖర్చవుతున్న ఈ మందులు, ప్రస్తుతం సుమారు 60 శాతం తగ్గి రూ.3,500 నుంచి రూ.4,000 మధ్యలో అందుబాటులోకి రావడం విశేషం. ఈ పరిణామం ఆరోగ్య రంగంలో ఒక పెద్ద మార్పుగా నిపుణులు భావిస్తున్నారు. బరువు నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ వంటి అంశాలు ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో ఈ ధరల తగ్గింపు ప్రజలకు పెద్ద ఉపశమనం ఇవ్వనుంది.

Advertisement

Diabetes Medicine : షుగర్ పేషెంట్లకు ఊరటనిచ్చే శుభవార్త .. భారీగా తగ్గిన డయాబెటిస్ మెడిసిన్ ధర ..!

Diabetes Medicine : జెనరిక్ మందులతో పెరిగిన పోటీ .. మార్కెట్ వేగంగా విస్తరణ

మార్చి 20న ఈ ఔషధానికి సంబంధించిన పేటెంట్ గడువు ముగియడంతో భారతీయ ఫార్మా కంపెనీలు జెనరిక్ వెర్షన్లను మార్కెట్లోకి తీసుకురావడం ప్రారంభించాయి. ఫలితంగా ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రముఖ కంపెనీలు ఈ రంగంలోకి దిగడంతో పోటీ మరింత పెరిగింది. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ల్యూపిన్, మ్యాన్‌కైండ్ ఫార్మా, జైడస్ వంటి సంస్థలు తమ తమ బ్రాండ్లతో మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాల వరకు ఈ మందులను విస్తరించేందుకు కంపెనీలు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో GLP-1 ఔషధాల మార్కెట్ విలువ రూ.1000 కోట్లకు చేరుకోగా వచ్చే ఏడాదిలో ఇది రూ.5,000 కోట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ఒక్క ఏడాదిలోనే దాదాపు 50కి పైగా బ్రాండ్లు ప్రవేశించే అవకాశముండటంతో ఈ విభాగంలో భారీ పోటీ నెలకొననుంది.

Advertisement

Diabetes Medicine : నిల్వ, వినియోగంలో జాగ్రత్తలు .. నిపుణుల హెచ్చరికలు

ఈ మందులు అందుబాటులోకి రావడం ఎంత ముఖ్యమో  వాటి సరైన వినియోగం కూడా అంతే కీలకం. సెమాగ్లుటైడ్ ఔషధాలను కోల్డ్ చైన్‌లో నిల్వ చేయడం తప్పనిసరి. నిల్వలో చిన్న తప్పిదం జరిగినా మందు ప్రభావం తగ్గిపోవచ్చు. అలాగే ఈ ఔషధాలను అనుభవం ఉన్న వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎండోక్రినాలజిస్టుల సలహా లేకుండా ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. సరైన డోసేజ్, నిరంతర పర్యవేక్షణ చాలా అవసరం. ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం మార్కెట్లోకి ఎన్నో బ్రాండ్లు వచ్చినా, సరైన కోల్డ్ స్టోరేజ్ మరియు సప్లై చైన్ వ్యవస్థ కలిగిన కంపెనీలే దీర్ఘకాలంలో నిలబడతాయి. వచ్చే ఆరు నెలల్లోనే ఈ పోటీలో చాలా కంపెనీలు బయటకు వెళ్లే అవకాశముందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. విదేశీ బ్రాండ్లపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గి, తక్కువ ధరల్లో సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి రావడం భారతీయులకు పెద్ద ఊరటనిచ్చే పరిణామంగా మారింది. డయాబెటిస్ మరియు ఒబెసిటీ సమస్యలతో బాధపడుతున్న లక్షల మందికి ఇది ఒక కొత్త ఆశను కలిగిస్తోంది.

 

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి