Health Benefits : ఈ మధ్య కాలంలో చాలా మంది తరచుగా అసిడిటీతో బాధపడుతున్నారు. దాన్ని తగ్గించుకునేందుకు, ఉపశమనం పొందొందేకు ఎంతగానో కష్టపడుతుంటారు. ఏవేవో తాగుతూ.. తింటూ అసిడిటీని తగ్గించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుంటారు. భోజనం ఎక్కువగా తీసుకోవడం లేదా తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఈ అసిడిటీ వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్య నుండి ఉపశమనం పొందేందుకు సమహజమైన మార్గం ఉందియ ఈ జ్యూస్ ని మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్క గ్లాస్ తాగారంటే చాలు ఎసిడిటీకి మూల కారణం అయిన యాసిడ్ రిఫ్లక్స్ నాశనం అవుతుంది. నిమిషాల వ్యవధిలోనే అసిడిటీ నుంచి ఉపశమనం పొందచ్చని వివరిస్తున్నారు. అయితే ఆ జ్యూస్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఇంట్లోని పోపుల డబ్బాలో ఉండే బిర్యానీ ఆకులతో అసిడిటీని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాదు ఎన్నో వంటకాల్లో వాడే ఈ బిర్యానీ ఆకుల వల్ల మోకాళ్ల నొప్పులు, నరాల వీక్ నెస్ ను తగ్గించుకోవచ్చట. అలాగే మనకు వచ్చే తిమ్మిర్లను కూడా ఇది తగ్గిస్తుందట. అయితే ఇన్ని ప్రయోజనాలను చేకూర్చే ఈ ఆకుకు అర చెంచా వాము, అర చెంచా సోంపు గింజలు కలిపి.. వీటన్నిటిని ఒక గ్లాసుడు నీళ్లతో పాటు మరిగించాలట. అలా తయారు చేసుకున్న కషాయాన్ని తాగటం వల్ల శరీరంలోని ఎన్నో సమస్యలు దూరం అవుతాయట. దీనిని నేరుగా తాగలేని వారు ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి. మధుమేహం ఉన్న వారైతే… నేరుగానే తాగాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం ఇది తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, తిమ్మిర్లు, అసిడిటీ, గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయట.
అయితే సోంపు గింజల వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. మనం ఏం తిన్నా వెంటనే అరిగిపోతుందట. సోంపు గింజల్లో ఉండే ఫైబర్ వల్ల మన శరీర బరువు తగ్గుతుందట. అలాగే వాము గింజల వల్ల మన శరీరంలోని పలు రసాయనాలను విడుదల చేసేలా చేస్తుందట. ఇి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయ పడుతుందట. వాము గింజలు వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల అజీర్తి, వికారం వంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే… నెల రోజుల్లోనే కిలో నుంచి రెండు కిలోల బరువు తగ్గొచ్చు. ఇంకా బిర్యానీ ఆకులు, సోంపు గింజలు, వాము… ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. అజీర్తి, వికారం, మోకాళ్ల నొప్పులు, తిమ్మిర్లు, నరాల వీక్ నెస్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక బరువును నివారించవచ్చు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.