Health Benefits : కివి పండుతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కీవీలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6 ఉండడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కరోనా వచ్చాక చాలామంది రోగనిరోధక శక్తిపై శ్రద్ధ పెట్టారు. కీవీ తీసుకుంటే కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ కె రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కీవీ పండ్లను తింటే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. కివి పండు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కివి పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వలన గుండెపోటు, గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన పొట్ట సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఉదయాన్నే పరగడుపున కివి పండ్లను తినడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. దీంతోపాటు మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. పోషకాలు అధికంగా కలిగిన కీవి పండ్లను తింటే శరీరంలో పోషకాల కొరతను తీరుస్తుంది. ప్రతిరోజు కీవీ పండ్లను తింటే బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో తినడం వలన ఎక్కువసేపు ఆకలి వేయదు. తద్వారా మీరు అధికంగా క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా నివారించవచ్చు.
కీవి పండ్లలో పోషకాలు, మినరల్స్ ఎక్కువగా ఉన్నందున కొంతమంది ఆరోగ్యంగా ఉండడానికి కీవి పండ్లను అధిక మోతాదులో తీసుకుంటుంటారు. కానీ అలా తినడం వలన అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ఇందులో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కీవీ ని ఎక్కువగా తినడం వలన కడుపునొప్పి, అలర్జీలు, కిడ్నీ సమస్యలు వస్తాయి. అందుకే చాలామంది వైద్యనిపుణులు కీవి పండ్లను రోజుకి మూడు మాత్రమే తీసుకోవాలని సూచిస్తారు. లేదంటే ఒక గ్లాసు కీవి జ్యూస్ మాత్రమే తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా తీసుకుంటే అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.