Health Tips : కొంతమందికి పళ్ళు గార పట్టడం, పసుపు పచ్చగా మారడం జరుగుతుంది. చాలామందికి రాత్రి సమయంలో బ్రష్ చేసే అలవాటు లేకపోవడం వలన పళ్ళు రంగు మారడం, గార పట్టడం జరుగుతుంది. అలాగే కొంతమంది పాన్, గుట్కా నమలడం వలన కూడా పళ్ళు గార పట్టడం ,నోటి దుర్వాసన సమస్య వస్తుంది. జాగ్రత్తగా పళ్ళు మొత్తం క్లీన్ అయ్యే విధంగా బ్రష్ చేసినట్లయితే దంత సమస్యలు ఉండవు. పళ్ళు తెల్లగా రావడం కోసం రకరకాల టూత్ పేస్ట్ లను వినియోగించకూడదు. పళ్ళు శుభ్రం అయ్యే విధంగా పైకి లోపలికి వెళ్ళే విధంగా జిగ్ జాగ్ గా ఉండే బ్రష్ లను ఉపయోగించాలి. చల్లనివి లేక వేడిగా తాగినప్పుడు పళ్ళు జివ్వుమని అనేవాళ్లు సెన్సిటివ్ టూత్ పేస్ట్ ను ఉపయోగించాలి.
అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఒకే రకమైన బ్రష్ ఉపయోగించకూడదు. పిల్లల పాల దంతాలు కాబట్టి వారికి చాలా సెన్సిటివ్ పళ్ళు ఉంటాయి. వాళ్లకోసం స్మూత్ గా ఉండే బ్రష్లను ఉపయోగించాలి. స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ వంటి తీపి పదార్థాలను తినకూడదు. రాత్రి తిన్న తర్వాత బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారం వెంటనే క్లీన్ చేసుకోవాలి. సిట్రస్ ఫుడ్ లను తినకూడదు. ఒకవేళ తింటే వెంటనే నోరు పుక్కిలించాలి. పంటి నొప్పి ఉన్నవారు గోరువెచ్చని ఉప్పు నీళ్లతో పుక్కిలించడం వలన తగ్గుతుంది. మౌత్ వాష్ ఉపయోగించడం వలన నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. నోట్లో పాచి కూడా తరచూ శుభం చేసుకుంటూ ఉండాలి. మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి బ్రష్ ను మార్చాలి. బ్రష్ చేసిన తర్వాత బ్రష్ గాలికి ఆరే విధంగా పెట్టాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే పళ్లపై ఉండే గార, పచ్చదనం పోతాయి. అలాగే పసుపు, నిమ్మరసం బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పెడితే ఒకసారి రుద్ది నోట్లో నీళ్లు పోసి కొని పుక్కిలించినట్లయితే తర్వాత మామూలు పేస్టు తో బ్రష్ చేయడం వలన పళ్ళపై ఉన్న గార పోతుంది. ఒక స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూన్ నిమ్మరసం, కొంచెం నీళ్లు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బ్రష్ తో పళ్లపై రుద్ది ఒక పది నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించడం వలన పళ్ళపై ఉండే గార, పసుపు పచ్చదనం పోతాయి. గ్లాస్ నీటిలో పావు స్పూన్ పసుపు వేసి ఆ నీటిని పుక్కిలించడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.