Groundnut : మనలో చాలామందికి పల్లీలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే టైం పాస్ కోసం తినడం కానీ లేదా ఆరోగ్యపరంగా చూసిన ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మంచి టైం పాస్ స్నాక్ ఐటం కూడా కాబట్టి దీన్ని ఎలా పడితే అలా అందరూ తినేస్తూ ఉంటారు. మరి పల్లీలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి. అవి ఎలా తీసుకుంటే ఆరోగ్యం ఎంత మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి అనే పూర్తి డీటెయిల్స్ చూద్దాం… పల్లీలు అదేపనిగా తినేస్తాం. తప్పించి పల్లీలు గురించి పూర్తి అవగాహన చాలా తక్కువ మందికే ఉంటుంది. వేరుశనగపప్పు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే.. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే పచ్చడి గాని లేదా వేయించి లేదా ఉప్పు పట్టించినవి తింటూ ఉంటాం. రోజుకు గుప్పెడు పల్లీలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లిలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయని న్యూట్రిషన్లు అంటున్నారు. ఇందులోని మోనోసారేటెడ్ కొవ్వు గుండెకు మంచిది.
శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ విటమిన్ ఈ, నియాసిన్, ప్రోటీన్, మాంగనీస్ వేరుశనగల్లో ఎక్కువ ఉంటాయి. వీటిని అల్పాహారంగా తీసుకునేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఔషధ తింటే క్యాలరీలు ఎక్కువ తీసుకున్నట్టే అంటే బరువు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక్కసారి ప్రాణాథిరిక పరిస్థితి కూడా కల్పిస్తుంది. వేరుశనగ ఎనర్జీకి సంకేతం అంటే ఎలర్జీ ఉన్నవాళ్లు ఇవి తింటే చర్మం పగిలినట్టుగా మారడం శ్వాస ఆడక పోవడం, జీర్ణక్రియ సమస్యలు, ముక్కు కారడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే పోషకాహార నిపుణులు ఎక్కువగా బరువు తగ్గడానికి వేరుశనగ తినాలని చెబుతుంటారు. అయితే అతిగా వాటిని తినడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం ఉంటుంది. అయితే ఇది స్నాక్స్ గా తినడానికైతే బాగుంటాయి.
అంటే ఎక్కువ బరువు ఉన్నవాళ్లు మితంగానే తినాలని కొంతమంది ఆరోగ్యపరంగా చెబుతున్నారు. వేరుశనగలు తీసుకోవడం వాతావరణం లో సాధారణంగా కనిపించే ఇవి బాగా కలిసిపోతాయి. దాని ప్రభావం కాలేయంపై చూపుతుంది. వేరుశనగలు పాస్ఫరస్ ప్రోటీన్లతో నిండు ఉంటాయి. చాలా ఎక్కువ ఫైట్ జింక్ వంటి అనేక ఇతర వేస్తుంది. నిజానికి పల్లిలు తినగానే మనకు దాహం వేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువ మందికి పల్లీలు తినగానే నీరు తాగే అలవాటు ఉంటుంది. మరి ఇలా నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం.. పల్లీలు తినగానే నీటిని తాగితే పల్లెల్లో ఉన్న ఆయిల్ నీరు మిక్స్ అయ్యి శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది.
ఇక రెండవది పల్లీలు తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కాదు..
దీనివల్ల మీకు గ్యాస్ ఫామ్ అవుతుంది సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మూడవదిగా పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మనం వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా మారిపోతాయి. కాబట్టి లోపల వేడి పదార్థం చల్లని పదార్థం ఒకదానికొకటి విరుద్ధ ఆహారాలు కాబట్టి ఈ క్రమంలో మీకు దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా కొన్ని సమయాల్లో ప్రాణహాన్ని కూడా కలిగిస్తాయి. కాబట్టి పల్లీలు తినగానే కనీసం ఒక పావు గంట తర్వాత మాత్రమే నీటిని తాగండి.. మీ ఆరోగ్యానికి మంచిది.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.