Home » Health » Over Weight 18 Year Old Girl Suffering From Anorexia Passes Away In Thalassery At Kerala
Health

Over Weight : అధిక బరువు తగ్గించుకొవాలి అనే మోజుతో.. 18 ఏళ్ల యువతి ప్రాణం కోల్పోయిన ఫ్యాషన్ డైట్…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: March 12, 2025, 12:00 pm
Advertisement

Over weight :  ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు వారిని వేధిస్తుంది. ఉండవలసిన బరువు కంటే అధికంగా బరువు ఉంటే, అది ప్రాణాంతకమే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బరువు తగ్గటానికి ప్రమాదకరమైన పద్ధతులను అలవాటు చేసుకుంటున్నారు. క్రాష్ డైట్ లు. వాటర్ ఫాస్టింగ్ ప్రజాదారణ పొందుతున్నప్పటికీ. అవి ప్రాణాంతకమని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రాణాంతకర పద్ధతులు అనుసరించడానికి ఎప్పటికప్పుడు డాక్టర్ ని సంప్రదిస్తూ ఉండాలి. నిర్లక్ష్యం చేశారు ప్రాణాలకే ప్రమాదం. అతి వేగంగా బరువు తగ్గటానికి పాటించేటువంటి పద్ధతులు ప్రాణాంతకం కావచ్చు కాబట్టి మానుకుంటే చాలా మంచిది.ప్రతి ఒక్కరు కూడా బరువు తగ్గాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. తగ్గాలని ఫ్యాషన్ గా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం అని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంది జిమ్ములకి అదే పనిగా వెళ్తూ ఉంటారు. అందరూ మితిమీరిన ఎక్సైజ్ లు చేస్తూ ఉంటారు. కొందరు ఏకంగా ఆహారం పై డైటింగ్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉంటారు. ఈరోజుల్లో బరువు తగ్గాలనుకునేవారు ఈ ట్రైన్ లను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. బరువు తగ్గాలంటే ఉపవాసం ఒక గొప్ప మార్గం. అంతేకాదు, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాని దీన్ని ఎక్కువ రోజులు పాటు గనుక అనుసరిస్తే మాత్రం.. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. సరిగ్గా ఇలాంటి ఘటనే కేరళలో ఒక యుతి ,ఆన్లైన్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న వాటర్ ఫాస్టింగ్ విధానంలో,ఒక 18 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. అసలు ఇది ఎలా జరిగిందో పూర్తి వివరాలతో తెలుసుకుందాం.

Advertisement

Over weight : అధిక బరువు తగ్గించుకొవాలి అనే మోజుతో.. 18 ఏళ్ల యువతి ప్రాణం కోల్పోయిన ఫ్యాషన్ డైట్…?

Over Weight 18 ఏళ్ల యువతి ప్రాణం కోల్పోయిన ఫ్యాషన్ డైట్

కేరళ కి చెందిన ఒక యువతి తలస్సేరీలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన. ఈ సంఘటన ఆన్లైన్ ట్రెండ్ల ప్రభావంతో విపరీతమైన డైటింగ్ వల్ల కలిగే ప్రాణాంతక పరిణామాల పట్ల ప్రమాదంగా ఉండాలని హెచ్చరిస్తుంది వైద్యశాఖ. బరువు తగ్గాలని వ్యామోహంతో 18 ఏళ్ల బాలిక సుదీర్ఘమైన నీటి ఉపవాసం చేసింది. అనారోగ్య సమస్యలకు దారితీసింది. దాదాపు ఆరు నెలలు పాటు ఆహారం తీసుకోకుండా , కేవలం నీటిని తాగుతూ వచ్చింది. చివరకు ఆ యువతి మరణానికి 12 రోజుల ముందు, తలస్సేరి కో – ఆపరేటివ్ హాస్పిటల్లోనే ఐసీయూలో చేరింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆమె కోల్కోలేక చివరకు ప్రాణాలను విడిచింది.

Advertisement

వాస్తవానికి, ఆ అమ్మాయి ఆన్లైన్ ప్రభావానికి లోనే కఠినమైన వాటర్ ఫాస్టింగ్ ప్రారంభించింది. దీంతో ఆమె ఆరోగ్యం క్రమక్రమంగా పూర్తిగా క్షీణించింది. మీటింగ్ పేరుతో ఆమె దాదాపు ఆరు నెలలు ఆహారం తీసుకోవడం మానేసింది అని తేలింది. యువతి పరిస్థితి విషమించడంతో ఆమే చనిపోవటానికి 12 రోజులు ముందు ఆమెను తలస్సేరి సహకార ఆసుపత్రిలోకి ఐసియులోకి చేర్చారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా కూడా ఆమె ప్రాణాన్ని కాపాడలేకపోయారు. కటిక ఉపవాసంతో ఆమె బరువు పూర్తిగా తగ్గిపోయింది. చివరకు కేవలం 24 కిలోలకు చేరింది. దాంతో ఆమె మంచం పట్టింది. బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్, సోడియం, కొత్త పోటు పూర్తిగా పడిపోయాయి. ఏంటి లెటర్స్ పై ఉంచారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఎవరుకు ఆమె మరణించటమే తద్యంగా మారింది. ఆసుపత్రి కన్సల్టెంట్ వైద్యుడు డాక్టర్ నాగేష్ మనోహర్ ప్రభు ప్రకటించారు.

క్రాష్ డైట్లు, వాటర్ ఫాస్టింగ్ ప్రజాదారణ పొందుతున్నప్పటికీ అవి వేగంగా బరువు తగ్గటానికి ప్రమాదకరమైన పద్ధతులు అంటున్నారు వైద్యులు. కావున, అలాంటి ప్రాణాంతకర పద్ధతులు అనుసరించే వారు ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదిస్తూ ఎలెక్ట్ గా ఉండాలి. అశ్రద్ధ చేశారో, మీ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వేగంగా బరువు తగ్గాలని చిట్కాలను పాటిస్తే ఇటువంటి పద్ధతులు ప్రాణానికే ముప్పు కావచ్చు అంటున్నారు వైద్యులు. ఈ పరిస్థితుల్లోని ఇలాంటి చిట్కాలను పాటించవద్దు అని చెబుతున్నారు. తక్కువ ఆహారాన్ని తీసుకోవచ్చు. అస్సలు తినకుండా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. తేలికపాటి వ్యాయామాలు, తేలికపాటి డైట్లు చేసుకోవాలి. అంతేకానీ కఠినమైన ఉపవాసాలు చేసి ప్రాణం మీదికి తెచ్చుకోవద్దు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి