Health Care Tips : పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకు పాలను ఇష్టపడుతుంటారు. కొందరు మాత్రం పాల వాసన చూడగానే మొహం తిప్పుకుంటారు. దాని వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిసాక అప్పుడు రియలైజ్ అవుతుంటారు. పాలల్లో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు చాలా ఉంటాయి. ఇది మన శరీరాన్ని అన్నివేళలా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే వైద్యులు పాలు, పెరుగు కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు. పాలతో తయారు చేసిన పదార్థాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, కొందరు పాలు తాగాక తెలిసో తెలియక కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు.
అలా చేయడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..కొందరు పాలు తాగాక, టిఫిన్ లేదా స్నాక్స్ తీసుకుంటుంటారు. మరికొందరు ఏకంగా భోజనం చేస్తారు. అయితే, పాలు తీసుకున్నాక లేదా ఈ ఆహార పదార్థాలు తిన్నాక గానీ పాలు అస్సలు తీసుకోరాదట.. అందులో కూరగాయ ముల్లంగి ఒకటి.. ఇది పాలతో పాటు కలిపి తీసుకుంటే ఇందులోని పుల్లని దనం పాలను విషపూరితంగా మారుస్తుంది. ఫలితంగా చర్మవ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా పప్పు వంటి పదార్థాలను కూడా తీసుకోరాదు. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పాలల్లో ఉండే ప్రోటీన్స్, పప్పులోని ప్రోటీన్స్ అధికమవడంతో రసాయనికి చర్య జరిగి గుండెపోటుకు దారి తీయొచ్చు..
పాలు లేదా పాల పదార్థాలు తీసుకున్నాక ఉప్ప అధికంగా కలిగిన ఆహార పదార్థాలు తీసుకోరాదు.. రాత్రి భోజనం చేశాక లేదా చేయకముందు ఇలా చేయొద్దు. సాల్ట్ చిప్స్, పెరుగు పదార్థాలు, పాప్ కార్న్ వంటి వాటిలో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. ఇవి కూడా చర్మ సమస్యలకు కారణం కావొచ్చు. అంతేకాకుండా పుల్లని పండ్లు అయిన ద్రాక్ష, పైనాపిల్, నారింజ, స్టాబెర్రీ వంటి వాటిని కూడా పాలతో కలిపి తీసుకోరాదు. ఇవి కూడా శరీరంలో విషపూరిత రసాయనాలను విడుదల చేస్తాయి. ఫలితంగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కఫం సమస్యలు, జీర్ణ సమస్యలు కూడా అధికమయ్యే అవకాశం లేకపోలేదు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.