
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే రాయదుర్గం, శంషాబాద్ మెట్రో రూట్ కు సంబంధించి పనులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్నారు. అది 31 కిలోమీటర్ల మేర నిర్మించబోయే మెట్రో కారిడార్. అయితే.. ఆ మెట్రో కారిడార్ లో భాగంగా కొన్ని కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించబోతున్నారు.
నిజానికి హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ మెట్రో లేదు. ఢిల్లీ, బెంగళూరులో ఇప్పటికే కొన్ని కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది. కానీ.. హైదరాబాద్ లో లేదు. కోఠి, సుల్తాన్ బజార్ ప్రాంతంలో అప్పట్లోనే అండర్ గ్రౌండ్ రూట్ నిర్మించాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. కానీ.. ఇప్పుడు రాయదుర్గం, శంషాబాద్ రూట్ లో ఎయిర్ పోర్ట్ దగ్గర 2.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ మెట్రోను నిర్మించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నిజానికి కరోనా కంటే ముందు ఎక్కువ మందే ప్రయాణించేవారు. ఇప్పుడు రద్దీ తగ్గింది. కానీ.. పీక్ అవర్స్ లో మాత్రం మెట్రోలో రష్ ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ పోర్ట్ కు వెళ్లాలంటే ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ బస్సు లేదంటే క్యాబ్, సొంత వాహనాల మీదనే ఆధారపడాలి. అందుకే.. ఎయిర్ పోర్ట్ కు మెట్రో సౌకర్యాన్ని కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఈ మెట్రో కారిడార్ కు రూ.6250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దాని కోసం ఖర్చయ్యే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
This website uses cookies.