Home » Inspirational » Headmaster From Madhya Pradesh Turned His Working Govt School Into Full Of Greenary In 20 Years
Inspirational

Inspiration : 20 ఏళ్లు కష్టపడి.. ఎడారిలా ఉన్న స్కూల్ ను పచ్చని వనంలా మార్చిన హెడ్ మాస్టర్

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 15, 2021, 8:00 pm
Advertisement

Inspiration : అలోక్ త్రిపాఠి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాకు చెందిన స్కూల్ హెడ్ మాస్టర్. గత సంవత్సరం లాక్ డౌన్ విధించిన తర్వాత అందరూ ఇంట్లో ఉంటే.. ఈయన మాత్రం.. స్కూల్ కు వెళ్లేందుకు తెగ ప్రయత్నించారు. అధికారుల కాళ్లు పట్టుకొని మరీ.. పర్మిషన్ తీసుకొని లాక్ డౌన్ టైమ్ లో కూడా ప్రతి రోజు స్కూల్ కు వెళ్లేవారు. అదేంటి. లాక్ డౌన్ సమయంలో స్కూళ్లు లేవు కదా. మరి.. ఈయన స్కూల్ కు వెళ్లి ఏం చేసేవారు.. అనే డౌట్ మీకే కాదు.. అధికారులకు కూడా వచ్చింది. ఆయన స్కూల్ కు వెళ్లేందుకు పర్మిషన్ కావాలి.. అని అడిగింది.. మొక్కలకు నీళ్లు పోయడం కోసం. అవును.. తన ప్రాణం కంటే ఎక్కువగా స్కూల్ లో మొక్కలు నాటి.. వాటిని తన పిల్లల్లా పెంచుతున్నారు ఈ హెడ్ మాస్టర్. అసలే లాక్ డౌన్.. ఆపై ఎండాకాలం. వాటికి నీళ్లు పోయకపోతే.. మొక్కలు ఎండిపోతాయని.. లాక్ డౌన్ సమయంలో పోలీసులను, అధికారులను బతిలాడి మరీ.. రోజూ స్కూల్ కు వెళ్లి కరోనాను సైతం లెక్క చేయకుండా.. మొక్కలను నీళ్లు పోసి వచ్చేవారు. అది మొక్కల మీద ఆయనకున్న ప్రేమ.

Advertisement

headmaster from madhya pradesh turned his working govt school into full of greenary in 20 years

ఇప్పుడు కాదు.. 20 ఏళ్ల కిందనే తను పనిచేసే స్కూల్ లో మొక్కలు నాటారు అలోక్. మొత్తం మూడున్నర ఎకరాల్లో న్న స్కూల్ అప్పుడు ఒక ఎడారిలా ఉండేది. స్కూల్ బిల్డింగ్ లు తప్పితే ఎక్కడా నిలువ నీడ లేదు. ఒక్క చెట్టు లేదు. అది ఒక స్కూల్ లా లేకపోవడంతో.. దాన్ని ఎలాగైనా మార్చాలనుకున్నారు. దాన్ని ఒక పచ్చని వనంలా మార్చాలనుకున్నారు.

Advertisement

తన చిన్నతనంలో ఒకసారి ఎక్స్ కర్షన్ వెళ్లినప్పుడు తన టీచర్.. చెట్ల విలువను చెప్పడంతో.. అప్పటి నుంచి చెట్లను నాటడమే ధ్యేయంగా పెట్టుకున్నారు అలోక్. తను స్కూల్ లో టీచర్ గా జాయిన్ కాగానే.. మొక్కలు నాటడం ప్రారంభించినప్పటికీ.. స్కూల్ కు గోడ లేకపోవడంతో.. మొక్కలను ఎవరైనా తెంచేయడం, బర్రెలు, గొర్రెలు లాంటివి వచ్చి.. వాటిని తినేయడం జరిగేది.

headmaster from madhya pradesh turned his working govt school into full of greenary in 20 years

Advertisement

దీంతో.. అక్కడి స్థానిక నాయకులను కలిసి.. స్కూల్ కు గోడ నిర్మించాలని రిక్వెస్ట్ చేసి.. స్కూల్ గోడను నిర్మించేలా చేసి.. అప్పుడు మొక్కలు నాటడం ప్రారంబించారు అలోక్.

Inspiration : 240 రకాల చెట్లను నాటిన హెడ్ మాస్టర్

2000 సంవత్సరంలో పండ్ల మొక్కలు, ఇతర ఔషధాల మొక్కలు నాటడం ప్రారంభించారు అలోక్. అలా.. 20 ఏళ్ల పాటు.. మొక్కలను నాటుతూ.. ప్రస్తుతం స్కూల్ ను ఒక పచ్చని వనంలా మార్చారు. ప్రస్తుతం ఆ స్కూల్ గ్రౌండ్ లో 240 రకాల మొక్కలు ఉన్నాయి. వాటిలో పండ్ల చెట్లు అయినటువంటి మామిడి, జామ చెట్లతో పాటు, నిమ్మ చెట్లు, తులసి చెట్లు, అశ్వగంధ చెట్లు, కరివెపాకు, ఇతర చెట్లను నాటారు.

headmaster from madhya pradesh turned his working govt school into full of greenary in 20 years

ఇదివరకు ఎడారిలా ఉన్న స్కూల్.. ఇప్పుడు పచ్చని వనంలా మారడంతో స్కూల్ కు రావడానికి చాలామంది పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. స్కూల్ మొత్తం ఒక పార్కులా పచ్చని చెట్లతో నిండి ఉండటంతో.. విద్యార్థులు ఎంతో సంతోషంతో స్కూల్ లో అడుగుపెడుతున్నారు. పచ్చిన చెట్ల మధ్య ఆహ్లాదంగా గడుపుతున్నారు.

Advertisement

headmaster from madhya pradesh turned his working govt school into full of greenary in 20 years

నేను ఇక రిటైర్ అయినా నాకు బాధ లేదు. నేను రిటైర్ అయ్యాక కూడా ఈ చెట్ల బాధ్యతను నా విద్యార్థులు చూసుకుంటారు. ఆ నమ్మకం నాకు ఉంది.. ఈ స్కూల్ విధ్యార్థులకు, చెట్లతో ఉన్న అనుబంధం అటువంటిది.. అందుకే నాకు ఎటువంటి టెన్షన్ లేదు.. అంటూ భావోద్వేగానికి గురయ్యారు అలోక్.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి