
కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నదని, ఎల్ఐసీతో పాటు పలు ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటు వారికి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఈ క్రమంలోనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేయాలని కోరుతూ ఈ నెల 27న ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో కొనసాగితే ప్రభుత్వ రంగ సంస్థలకు ముప్పు పొంచి ఉంటుందని వివరించారు.
మోడీ నేతృత్వంలోని బీజేపీ వల్ల దేశంలో సామాన్యుడికి ఇబ్బందులే ఎదురవుతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెరిగాయని, సామన్యుడి నడ్డీ విరుగుతున్నదని చెప్పారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో జనం ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం ప్రభుత్వం కూడా అలాంటి ఇబ్బందులే క్రియేట్ చేస్తున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పి జిల్లా నేతలు నాగసుబ్బారెడ్డి, చంద్రశేఖర్, సుధీర్ పాల్గొన్నారు.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.