
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇక అయిపోయింది అనుకునే లోపు ఈ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ త్వరలో రాబోతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని అంటున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సోమవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ రెండు డోసులు కంపల్సరీగా తీసుకోవాలని తెలిపారు.
ఈ అవగాహనా కార్యక్రమంలో షీ టీం ఏఎస్ఐ విజయమణి, కళా బృందం ఇన్చార్జి రామంచ తిరుపతి, కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. పోలీసులు కొవిడ్ నేపథ్యంలో ఇలా అవగాహన కల్పించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తామని అంటున్నారు. ఇకపోతే కొవిడ్ నివారణకుగాను గతంలోనూ కళాబృందం ఆధ్వర్యంలో పోలీసులు, కళా బృందం సభ్యులు పలు కార్యక్రమాలు నిర్వహించారు.
Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…
Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…
World's Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన…
Redmi K100 Review : సాధారణంగా రెడ్మీ Redmi అంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ అని…
Rythu Bharosa : తెలంగాణ Telangana Farmars రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు…
Gold, Silver Rate Today, 12 February 2026 : హైదరాబాద్ పసిడి మార్కెట్లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు…
Brahmamudi February 12th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'బ్రహ్మముడి' రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠగా…
Karthika Deepam 2 February 12th 2026 Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'కార్తీక…
This website uses cookies.