దేశానికి అన్నం పెట్టే రైతును రాజు చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, అన్నదాత సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కారు పని చేస్తున్నదని మంత్రి అజయ్ తెలిపారు. సోమవారం జిల్లాలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలోని రైతు వేదిక భవాన్ని మంత్రి అజయ్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నదని చెప్పారు. రైతు వేదికను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, కలిసి కట్టుగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రైతాంగ శ్రేయస్సు కోసమే రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు తీసుకొచ్చారని మంత్రి అజయ్ వివరించారు. వ్యవసాయంలో నూతన విధానాల ఎంపికపై అధికారులతో చర్చించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, జెడ్పీ చైర్మన్ కమాల్ రాజు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం కొద్ది రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…
Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…
Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత పలు సినిమాలు చేయగా,అందులో విజయం సాధించినవి చాలా తక్కువే అని…
Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో…
Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…
Free Gas Cylinder : ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. టిడిపి, జనసేన మరియు…
Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ…
This website uses cookies.