జిల్లాలోని మహానంది సమీపంలోని అగ్రికల్చర్ కాలేజీ వద్ద ఉన్న పాలేరు వాగు వద్ద బ్రిడ్జి నిర్మించాలని సీపీఐ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు ఉప్పొంగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. సోమవారం పాలేరువాగు ప్రాంతాన్ని సీపీఐ కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.బాబా, ఫక్రుద్దీన్ మండల కార్యదర్శి ఆర్.సామేలు, రైతు సంఘం నాయకులు, పంచాయతీ వార్డు మెంబర్ సందర్శించారు.
వాగు వల్ల టూరిస్టులు, స్థానిక ప్రజలు అటు నుంచి ఇటు పోవడానికి వీలులేకుండా ఉండబోదని, రాకపోకలు నిలిచిపోతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకోని పక్షంలో సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్రిడ్జి కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఇకపోతే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో, రాష్ట్రంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటి వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.