జిల్లాలోని మహానంది సమీపంలోని అగ్రికల్చర్ కాలేజీ వద్ద ఉన్న పాలేరు వాగు వద్ద బ్రిడ్జి నిర్మించాలని సీపీఐ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు ఉప్పొంగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. సోమవారం పాలేరువాగు ప్రాంతాన్ని సీపీఐ కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.బాబా, ఫక్రుద్దీన్ మండల కార్యదర్శి ఆర్.సామేలు, రైతు సంఘం నాయకులు, పంచాయతీ వార్డు మెంబర్ సందర్శించారు.
వాగు వల్ల టూరిస్టులు, స్థానిక ప్రజలు అటు నుంచి ఇటు పోవడానికి వీలులేకుండా ఉండబోదని, రాకపోకలు నిలిచిపోతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకోని పక్షంలో సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్రిడ్జి కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఇకపోతే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో, రాష్ట్రంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటి వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
This website uses cookies.