కార్మికులు ఐక్యంగా ఉండి బలమైన క్రియాశీల ఉద్యమాలు చేసినప్పుడే కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దవుతాయని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో సీపీఎం నేతలు మిర్యాలగూడలో కేంద్రప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్టాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరక చట్టాలను తీసుకొస్తున్నదని చెప్పారు. సామాన్యుడి నడ్డీ విరచడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు.
కేంద్రం కార్మికులు పోరాడి తెచ్చుకున్న పనిగంటలను పెంచిందని పేర్కొన్నారు. కేంద్రం పని గంటలను ఎనిమిది గంటల నుంచి 12 గంటలకు మార్చిందని వివరించారు. ఇకపోతే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకుగాను కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో జూలకంటి రంగారెడ్డి, సీపీఎం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.