
కార్మికులు ఐక్యంగా ఉండి బలమైన క్రియాశీల ఉద్యమాలు చేసినప్పుడే కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దవుతాయని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో సీపీఎం నేతలు మిర్యాలగూడలో కేంద్రప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్టాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరక చట్టాలను తీసుకొస్తున్నదని చెప్పారు. సామాన్యుడి నడ్డీ విరచడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు.
కేంద్రం కార్మికులు పోరాడి తెచ్చుకున్న పనిగంటలను పెంచిందని పేర్కొన్నారు. కేంద్రం పని గంటలను ఎనిమిది గంటల నుంచి 12 గంటలకు మార్చిందని వివరించారు. ఇకపోతే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకుగాను కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో జూలకంటి రంగారెడ్డి, సీపీఎం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
This website uses cookies.