April : ఏప్రిల్-1.. పెరగనున్న ధరలు.. కస్టమర్ల జేబులకు చిల్లు..!
April : ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొన్ని మార్పులు అనేవి కామన్ గానే ఉంటాయి. ఇప్పుడు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం రెండు రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ ఏప్రిల్-1 మాత్రం మామూలుగా అయితే ఉండేలా కనిపించట్లేదు. గతంతో పోలిస్తే చాలా రకాలుగా ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సారి ఆర్బీఐ రూల్స్ ను కాస్తంత సరళతం చేస్తోంది. దాని వల్ల అన్ని బ్యాంకులకు ఆర్థిక పన్నుల విధానంలో విచ్చలవిడి తనం పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పెన్షన్ రెగ్యులేటర్ PFRDA, నేషనల్ పెన్షన్ సిస్టం (NPS) ఖాతాలోకి లాగిన్ అయ్యే నిబంధన మార్చింది. ఈ కొత్త ఆర్థిక ఏడాది నుంచి ఎన్ పీఎస్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి యూజర్ ఐడీ పాస్ వర్డ్ తో పాటు ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ కూడా అవసరమే. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఖాతాలోకి వెళ్లగలరు. దాంతో పాటు ఈపీఎఫ్ వో రూల్స్ లో ఏప్రిల్ 1 నుంచి చాలా పెద్ద మార్పులు తెస్తోంది ఆర్బీఐ. కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) నుంచి, ఒక వ్యక్తి ఉద్యోగం మారితే అతని EPF ఖాతా ఆటోమేటిక్గా కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది.
కానీ ఇంతకు ముందు మాత్రం అభ్యర్థి కోరితే మాత్రమే బదిలీ చేసేవారు. ఇక కొత్త ఏడాదిలో డిఫాల్ట్ పన్ను విధానం రాబోతోంది. ఈ కొత్త విధానంలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. లేదంటే మాత్రం మీ ITR కొత్త పన్ను విధానంలోనే ఫైల్ అవుతుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే, అదే పద్ధతిలో ITR పైల్ చేయవచ్చు. కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఒక్క రూపాయి కూడా టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక దాంతో పాటు ఎస్బీఐ బ్యాంకు డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ చార్జీని కూడా ఏకంగా 75 రూపాయలు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది.
ఇక అటు క్రెడిట్ కార్డుల వినియోగదారులకు కూడా ఝలక్ ఇచ్చింది ఎస్బీఐ. SBI క్రెడిట్ కార్డ్తో చేసే అద్దె చెల్లింపుపై లభించే రివార్డ్ పాయింట్లను ఏప్రిల్ 1 నుంచి నిలిపివేస్తోంది. అటు అత్యవసర ఐషధాల ధరలను 0.0055 శాతం పెంచుతున్నట్లు భారత ఔషధ ధరల నియంత్రణ సంస్థ ప్రకటించింది.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.