YS Jagan : కేంద్రం దూకుడు తట్టుకోలేక.. కంటతడి పెడుతున్న వైఎస్ జగన్?

Ys jagan కేంద్రం దూకుడు ఏపీ సీఎం జ‌గ‌న్ Ys jagan కొంప ముంచుతోంది. అవ‌స‌ర‌మైన విష‌యాల్లో.. ముఖ్యంగా జ‌గ‌న‌కు అంతో ఇంతో మైలేజీ ఇచ్చే విష‌యాల్లో కేంద్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ.. ఇరుకున పెడుతుండ‌గా.. శాస‌న మండ‌లి విష‌యంలోమాత్రం.. జ‌గ‌న్ Ys jagan స‌ర్కారు చేసిన తీర్మానాన్ని ఆమోదించే అవ‌కాశం ఉంద‌నే సంకేతాలు ఇస్తుండ‌డం ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో ఇప్పుడు చేయాలి ? అనే విష‌యం అధికార పార్టీలో అంత‌ర్మ‌థ‌నానికి దారితీస్తోంది.

ఏడాదిన్న‌ర కింద‌ట‌.. రాష్ట్ర శాస‌న మండ‌లిలో వైసీపీ బ‌లం చాలాత‌క్కువ‌. టీడీపీ TDP అత్యంత బ‌లంగా ఉండేది. అయితే.. అప్ప‌ట్లో జ‌గ‌న్ స‌ర్కారు తీసుకువ‌చ్చిన మూడు రాజ‌ధానులు, ఏపీ సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లుల‌ను టీడీపీ TDP మండ‌లిలో వ్య‌తిరేకించింది. దీంతో జ‌గ‌న్ Ys jagan స‌ర్కార్ మండ‌లి ర‌ద్దుకు ప్ర‌తిపాదించింది. మండ‌లి వ‌ల్ల ఖ‌ర్చు త‌ప్ప ప్ర‌యోజ‌నం లేద‌ని.. అందుకే ర‌ద్దు చేస్తున్నామ‌ని.. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌క‌ర‌మైన రాష్ట్రానికి ప్ర‌యోజ‌నక‌ర‌మైన నిర్ణ‌యాల‌ను కూడా టీడీపీ అడ్డుకుంటోంద‌ని.. అందుకే మండ‌లి ర‌ద్దుకు ప్ర‌తిపాదిస్తున్నామ‌ని.. నాడు స‌భ‌లో ప్ర‌క‌టించి..ఆవెంట‌నే ర‌ద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపారు.

AP CM Ys Jagan vs central govt

ఎమ్మెల్సీ ఆశావహుల్లో టెన్షన్.. Ys jagan

అయితే.. ఏడాదిన్న‌ర కాల‌మైన నేప‌థ్యంలో కేంద్ర య‌థావిధిగా ఇత‌ర అంశాల మాదిరిగానే దీనిని కూడా చాప‌చ‌ట్టేసిన‌ట్టేన‌న‌ని అంద‌రూ అనుకున్నారు. ఇప్పుడు మండ‌లిలో వైసీపీ Ysrcp ఆధిప‌త్యం పెరుగుతూ వ‌స్తోంది. మ‌రికొద్ది నెల‌ల్లోనే ఈ సంఖ్య మ‌రీ పెరిగి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పూర్తిగా వైసీపీతోనే శాస‌న మండ‌లి నిండిపోతుంది. దీంతో ఇక‌, త‌మ‌కు తిరుగులేద‌ని.. వైసీపీ నాయ‌కులు కూడా ఆనందం వ్య‌క్తం చేశారు. అయితే.. ఇంత‌లోనే టీడీపీ TDP ఎంపీ.. క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్‌.. మండ‌లి ర‌ద్దు తీర్మానం అంశాన్ని రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావించారు.

Ys jagan

దీనికి కేంద్రం ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. ర‌ద్దు తీర్మానాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని.. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్లడించింది. దీంతో ఒక్క‌సారిగా వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్ట‌డం మొద‌లైంది. మండ‌లి ర‌ద్ద‌యితే.. వైసీపీ Ysrcp నేత‌ల‌కు ఇత‌ర ప‌ద‌వులు కేటాయించ‌డం క‌ష్టం. అలాగ‌ని ర‌ద్దు తీర్మానాన్ని వెన‌క్కి తీసుకోమ‌ని కోరితే.. అది మ‌రింత అవ‌మానం.. మొత్తంగా కేంద్రం జ‌గ‌న్‌ Ys Jagan ను మ‌రోసారి ఇరికించేసింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ విషయమై అధికార పార్టీ నేతల్లో మల్లగుల్లాలు షురూ అయ్యాయి. ఇప్పటివరకు ఎమ్మెల్సీలపై భారీ ఆశలు పెట్టుకున్న నేతలంతా.. ఏం చేయాలోనని మధనపడుతున్నారని కేడర్ చర్చించుకుంటోంది.

Recent Posts

Wife : వామ్మో శోభనం రోజే భర్తకు చుక్కలు చూపించిన భార్య.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా..!

Wife  : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…

51 minutes ago

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…

2 hours ago

Health Test : ఈ 30 సెక‌న్ల ప‌రీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియ‌జేస్తుంది..!

Health Test  : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం…

3 hours ago

Monalisa : వామ్మో నువ్వేనా..? పూస‌ల‌మ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో..!

Monalisa : కొన్ని నెలల క్రితం జరిగిన కుంభమేళాలో పూసలు అమ్మకుంటూ కనిపించిన వైరల్ గర్ల్ మోనాలిసా తన చేప…

4 hours ago

Smartphone Charger : చార్జర్‌పై ఉన్న ఆ చిన్న చిన్న గుర్తుల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

Smartphone Charger : మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కి చార్జింగ్ పెడుతుంటే, చార్జర్ అడాప్టర్‌పై ఉన్న చిన్న చిన్న చిహ్నాలను ఓసారి…

5 hours ago

Kannappa Movie : వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా…!

Kannappa Movie : టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప' విడుదల సందర్భంగా తీవ్ర…

6 hours ago

Strawberry : స్ట్రాబెరీనా మజాకా… దీని ప్రయోజనాలు తెలిస్తే… వదలనే వదలరు..?

Strawberry : మనకి ప్రకృతి ప్రసాదించిన రుచికరమైన పండులో పండు కూడా ఒకటి.ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు.…

7 hours ago

22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన అత్త‌.. చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే..?

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం…

8 hours ago