
Bengaluru : బెంగళూరులో నీటి కొరత... చేతులెత్తేసిన సీఎం సిద్దూ..!
Bengaluru : దక్షిణాది రాష్ట్రాలలో నీటి కరువు అనగానే ముందుగా గుర్తు వచ్చే పేరు చెన్నై పట్నం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మంచినీళ్ల కోసం చెన్నై వాసులు పడుతున్న యాతన గురించి పలు రకాల కథలు మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ కష్టం కన్నడ రాష్ట్రానికి వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం వేసవి రాకముందే కన్నడ రాష్ట్రంలో దాహం దహించి వేస్తుంది. ఈ క్రమంలోనే బెంగళూరులో బిందె నీళ్ల MRP రోజురోజుకీ విపరీతంగా పెరుగుతుంది. ఇక కర్ణాటక రాజకీయ నాయకులు డీకే శివకుమార్ కూడా చేతులెత్తేశారు. అయితే అసలు కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు ఇంత నీటి కటకట…?ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే..
వేసవికాలం రాకముందే కర్ణాటక రాష్ట్రంలో నీటి కొరత ఏర్పడింది. భూగర్భ జలాలు ఎండిపోవడంతో మూడు వేలకు పైగా బోరుబావులు కూడా ఎండిపోయాయి. దీంతో నీళ్లు దొరక్క కన్నడ ప్రజానీకం సతమతమవుతున్నారు. ఇక ఈ సమస్యను డిప్యూటీ సీఎంకు చెప్పగా నీళ్లు లేవన్న సంగతి నాకు కూడా తెలుసు మా ఇంట్లో ఉన్న బోర్ కూడా ఎండిపోయింది ఏం చేయమంటారు అంటూ స్వయంగా డిప్యూటీ సీఎం కూడా చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య పలు రకాల నేతలతో నీటి కొరత పై లోతుగా చర్చలు జరుపుతున్నారు. మంచినీటి కొత్త పై లోతుగా చర్చలు జరుపుతున్నారు. అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవసరం అయితే జిల్లాకు 70 కోట్ల నిధులు కూడా రిలీజ్ చేస్తామని కొత్త బోర్ బావులు తవ్వండి అంటూ సిద్దు సర్కార్ హామీ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం మంచినీళ్లు తర్వాతనే ఏదైనా అనేది కర్ణాటక సర్కార్ హుకుం.
అయితే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 7వేలకు పైగా గ్రామాలలో వెయ్యికి పైగా వార్డులలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం కూడా అవసరమైన చోట్ల ట్యాంకర్లను సప్లై చేయండి అంటూ ప్రైవేట్ బోర్ వెల్స్ కి ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే మోస్తారు నీటి వనరులు ఉన్న హోస్కోట్ చెన్నపట్న, మగడి వంటి ప్రాంతాలు ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ఇక ఎప్పటినుండో సిలికాన్ సిటీగా పిలవబడే బెంగళూరులో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది అని చెప్పాలి. నీటి కోసం ఆఫీసులను వదిలేసి మరి ట్యాంకర్ల వద్ద క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బెంగళూరులో రెండు బిందెల నీటిని నాలుగు రోజులు ముందే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కనీసం స్నానం చేయడానికి బయటకు వెళ్లడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.