Farmers : ఏ ప్రభుత్వ హయాంలో అయినా సరే అట్టడుగు వర్గాలకు లబ్ది చేకూరే వేధంగా కొన్ని విధానాలను రూపొందిస్తారు. అందులో కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సమాజంలో చాలా రకాల వర్గాల ప్రజలు ఉంటారు. అందరూ ఒకే స్థాయి ఆర్థిక బలాలను కలిగి ఉండరు. కాబట్టి ఈ విధమైన వర్గాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చాలారకాల విధానాలను రూపొందించింది. అందులోనూ రైతలును, నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకం ద్వారా రైతులకు మంచి ఆర్థికవృద్ధి చేకూరుతుందని చెబుతున్నారు.ఇందులో ప్లాన్ కింద నెలకు 55 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత 60 సంవత్సరాల పెట్టుబడి తర్వాత, మీరు నెలకు రూ. 3000 పొందుతారు. మరిదీనికి సంబంధించినపూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పథకాన్ని పూర్తిగా పేద రైతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చింది.ఇందులో భాగంగా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం వల్ల వృద్ధాప్యంలో రైతులు ఆనందంగా జీవించేందుకు ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో పింఛన్ రూపంలో ఆర్థిక భరోసా ఇవ్వనుంది ఈ పథకం.ఎందుకంటే ఇప్పుడు చాలా ఇళ్లలో పిల్లలు తమ తల్లిదండ్రులు చూసుకోలేకపోతున్నారు. అందుకే అలాంటి తల్లిదండ్రుల కోసం ఇప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్లాన్ లో పెట్టుబడి రూపంలో డబ్బులు ఆదా చేసి.. వృద్ధాప్యంలో వాటిని పింఛన్ రూపంలో పొందవచ్చు.
కాకపోతే ఈ పథకానికి అందరూ అర్హులు కారు. కేవలం 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్న రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వాయిదా వయస్సు ఆధారంగా ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే నెలకు రూ.55 రూపాయలు ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత రూ.110, 40 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే రూ.220 చెల్లించాల్సి ఉంటుంది ఉంటుందని చెబుతున్నారు. అది కూడా నెలకు మాత్రమే.అయితే మీ వయసు ఎప్పుడైతే 60 ఏళ్లు నిండుతుందో అప్పటి నుంచి ప్రతినెలకు రూ.3వేలు ఇస్తారు. ఇదిమీరు బతికి ఉన్నంత కాలం వర్తిస్తుంది. ఇలా ప్రతి నెల 3వేల రూపాయలు అంటే.. ఒక్క ఏడాదికి రూ.36వేల వరకు లబ్దిదారుడిఖాతాలో జమ చేస్తారన్న మాట. అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకొని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.