Rice Ban : విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన విషయం తెలుసు కదా. ఆ ఎఫెక్ట్ ప్రస్తుతం యూఎస్ మీద పడింది. అవును.. ఇటీవలే భారత ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయంతో యూఎస్ లో ఒక్కసారి బియ్యం సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా తెలుగువాళ్లు అయితే బియ్యం ఎక్కడ దొరకవో అని స్టోర్లకు క్యూ కట్టేశారు. ఒక్కొక్కరు 10 బస్తాలు, 20 బస్తాల బియ్యాన్ని కొనుక్కొని తీసుకెళ్తున్నారు. దీంతో స్టోర్ల ముందు ఎక్కడ చూసినా ఇండియన్సే కనిపిస్తున్నారు.బియ్యం కోసం ఇండియన్స్ స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. అందులో ఎక్కువగా తెలుగువాళ్లే ఉండటం గమనార్హం. దానికి కారణం.. తెలుగువాళ్లు ఎక్కువగా రైస్ తింటారు. వాళ్లకు అన్నం లేకుంటే ముద్ద దిగదు.
అందుకే.. బియ్యం స్టాక్ అయిపోతే బియ్యం సంక్షోభం ఎక్కడ ఏర్పడుతుందో అని స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. భారత్ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిందనే విషయం తెలియగానే పోటీ పడి మరీ బస్తాలకు బస్తాలు కొనుక్కెళ్తున్నారు.ఇక.. బియ్యానికి డిమాండ్ పెరగడంతో కొన్ని బియ్యం స్టోర్ల ముందు నో స్టాక్స్ బోర్డ్స్ పెట్టారు. ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. సోనా మసూరి బియ్యానికి యూఎస్ లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఆ బియ్యం అస్సలు దొరకడం లేదు. డబ్బులు ఎక్కువ పెట్టి కొందామన్నా దొరకడం లేదు. స్టోర్లు, మార్టులు ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే. నిజానికి.. బియ్యం ఎక్కువగా పండేది మన దగ్గరే.
ప్రపంచం మొత్తానికి బియ్యం సరఫరా చేసే దేశాల్లో 45 శాతం వాటా భారత్ దే. మన దేశం నుంచి బియ్యం.. చాలా దేశాలను ఎగుమతి అవుతుంది. అందులో యూఎస్ కూడా ఒకటి. అక్కడ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి బియ్యం ఎక్కువగా అక్కడికి ఎగుమతి అవుతూ ఉంటుంది. అయితే.. మన దగ్గర ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండేందుకు బియ్యం ఎగుమతులను కేంద్రం నిలిపివేసింది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు అమెరికాలో కనిపిస్తోంది. అక్కడ స్టోర్ల వద్ద ఇండియన్స్ హడావుడి కనిపిస్తోంది. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.