Home » Exclusive » Good News For Ration Card Users Govt Will Give 35kg Every Month
Exclusive

Ration Card : రేషన్ కార్డు వినియోగదారులకు శుభవార్త… ప్రతి నెల 35 కిలోలు ఇవ్వనున్న ప్రభుత్వం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: May 30, 2024, 1:00 pm
Advertisement

Ration Card  : మీకు రేషన్ కార్డు ఉన్నదా. అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకు వచ్చింది. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రేవంత్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నది. ఈ తరుణంలోనే అంత్యోదయ అన్న యెజన రేషన్ కార్డుదారులు ఎన్నో ప్రయోజనాలను పొందాలి అని నిర్ణయం తీసుకున్నారు. దారిద్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాల కోసమే మోడీ ప్రభుత్వం అంత్యోదయ అన్న యెజనలను అమలు చేసింది. ఈ పథకం కింద ప్రతి నెల ఒక కుటుంబానికి 35 కిలోల చొప్పున ధాన్యాన్ని ఇవ్వనన్నట్లుగా తెలిపారు. చక్కెర మరియు గోధుమలు, బియ్యం కూడా ఇవ్వనున్నారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో ఏఏవై కార్డుదారులకు పంచదార పంపిణీ చేయటానికి పలువురు రేషన్ డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపటం లేదు. కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు అసలు డిడి చేయడమే లేదు అని కొందరు తెలియజేస్తున్నారు. దీనితో కార్డు దారులకు చక్కేర అనేది సరిగా అందడం లేదు. ఈ విషయాలు అన్నీ కూడా పౌర సరఫరా శాఖ దృష్టికి రావడంతో కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల వారీగా అంత్యోదయా అన్న యోజన కార్డు దారులకు అవసరమైన చక్కెర ను తీసుకొని పంపిణీ చేయాలి. ఇక నుండి రాష్ట్రంలోని ఏఏవై కార్డుదారులకు కూడా ఈ సౌకర్యం అనేది లభిస్తుంది. ఇప్పుడు మనదేశంలో దాదాపుగా 1.89 కోట్ల కుటుంబాలకు ఈ అంత్యోదయ రేషన్ కార్డులు అనేవి ఉన్నవి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 5.99 లక్షల మందికి కార్డులు అనేవి ఉన్నాయి. ఒక్కో కార్డు చెప్పున తీసుకుంటే నెలకు కిలో 599 టన్నుల చక్కెర అనేది వస్తుంది. ఈ మేరకు డీలర్లు కార్డులకు కేటాయించినటువంటి విధంగా డీడీ తీసి చక్కెరను తీసుకోవాలి.

Ration Card : రేషన్ కార్డు వినియోగదారులకు శుభవార్త… ప్రతి నెల 35 కిలోలు ఇవ్వనున్న ప్రభుత్వం…!

Advertisement

మన తెలంగాణలో మొత్తం 17,235 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అయితే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు బియ్యానికి అనుకూలంగా చక్కెరను పక్కదారి పట్టిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలోనే పౌరసరపరాల శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. మార్కెట్ లో రూ.40 -45 మధ్య ధర ఉన్నట్లయితే ఏఏవై కార్డు ఉన్నవారు కిలోకు రూ.13.5 సబ్సిడీ ఇవ్వనున్నారు. శాశ్వత ఆదాయ వనరులు లేని దేశంలోని ఇతర ప్రజలకు మాత్రమే ఈ అంతోద్యయ రేషన్ కార్డులు అనేవి ఇవ్వబడుతుంది. వికలాంగులకు కూడా ఈ ఆహార రేషన్ కార్డు కూడా అందుబాటులో ఉన్నది. భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులు మరియు సన్న కారు రైతులు లేక చెత్త సేకరించేవారు రిక్షా పుల్లర్లు మరియు మురికివాడలో నివసిస్తున్నటువంటి ప్రజలు సాధారణంగా అంత్యోదయ అన్న యెజన ప్రయోజనాలను పొందుతారు.

ఎలాంటి ఆదాయ వరలు లేని వితంతువు లేక 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులకు కూడా ఈ రేషన్ కార్డుకు అర్హులు. ఈ అంత్యోదయ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి సొంత ఇల్లు కూడా ఉండకూడదు. అంతేకాక వార్షికోత్సవం కూడా 20,000 మించకూడదు అన్నారు. అంతేకాక ఇంతక ముందు ఉన్నటువంటి రేషన్ కార్డు కూడా ఉండకూడదు అని తెలిపారు…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి