
Jahnavi Kandula family awarded Rs 262 crore compensation in death case
Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి సియాటెల్ నగరం 29 మిలియన్ డాలర్లు (సుమారు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. 2023 జనవరి 23న జరిగిన ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందిగా నిలిచింది. తాజాగా ఈ కేసులో ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో పరిహార ప్రక్రియకు మార్గం సుగమమైంది.
Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
జాహ్నవి కందుల 2021లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లి సియాటెల్లోని సౌత్ లేక్ యూనియన్ ప్రాంతంలో ఉన్న నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. 2023 జనవరి 23న ఆమె రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనాల గరిష్ఠ వేగ పరిమితి 40 కిలోమీటర్లు మాత్రమే. అయితే ఘటన సమయంలో పోలీసు అధికారి సుమారు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపినట్లు విచారణలో వెల్లడైంది. ఢీకొట్టిన ప్రభావంతో జాహ్నవి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరి పడినట్లు సమాచారం. తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆగ్రహానికి దారి తీసింది.
ఈ ఘటన అనంతరం సంబంధిత పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారి తీశాయి. జాహ్నవి మృతిపై ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడిన ఆడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. “ఆమె చనిపోయింది చాలా సాధారణ వ్యక్తి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది” అంటూ నవ్వుతూ మాట్లాడిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై భారత్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అమెరికాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆ అధికారిపై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకొని చివరికి విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనతో అమెరికా పోలీస్ వ్యవస్థపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ కేసులో పరిహారం విషయంలో జాహ్నవి కుటుంబం న్యాయపోరాటం కొనసాగించింది. ఇరుపక్షాలు గత వారం కోర్టులో సంయుక్తంగా దరఖాస్తు దాఖలు చేయగా సియాటెల్ నగరం 29 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లకు సమానం. ఈ విషయంపై సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేస్తూ “జాహ్నవి కందుల మృతి అత్యంత విషాదకరం. ఈ పరిహారం ఆమె కుటుంబానికి కొంతమేర న్యాయం, ఉపశమనం అందిస్తుందని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందంపై జాహ్నవి కుటుంబం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. జాహ్నవి మృతి భారతీయ విద్యార్థుల భద్రత, విదేశాల్లో పోలీసు బాధ్యతలపై కొత్త చర్చలకు తెరలేపింది. ఈ భారీ పరిహారం నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలకు దారితీయాలని కుటుంబ సభ్యులు, భారతీయ సమాజం ఆశిస్తున్నారు.
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
This website uses cookies.