Ajith Pawar : 2019 ఎన్నికలు జరగడానికి ముందు.. మహారాష్ట్రలో పరిస్థితులు వేరేగా ఉండేవి. ఆ తర్వాత వేరేగా మారాయి. 2019 ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి విజయం సాధిస్తుందని అంతా భావించారు. అలాగే.. ఎన్నికల్లో రెండు పార్టీలకు మంచిగానే సీట్లు వచ్చాయి కానీ.. అధికారం పంపకంలో రెండు పార్టీల మధ్య చెడింది. ముఖ్యమంత్రి, మంత్రుల పదవుల విషయంలో రెండు పార్టీలకు చెడటంతో రెండు పార్టీలు దూరం అయ్యాయి. కానీ.. శివసేన పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. అది ఎలా సాధ్యం అయింది అంటే.. ఎన్సీపీని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకుంది.
కానీ.. ఇక్కడ ఎన్సీపీలో ముఖ్య నేత అజిత్ పవార్ వేసే ఎత్తుగడలను ఎవ్వరూ ఊహించలేకపోయారు. శరద్ పవార్ కు ఆయన చాలా సార్లు, షాక్ లు ఇస్తూ వచ్చారు. శివసేన కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అజిత్ పవార్. కానీ.. ఆ తర్వాత మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో అజిత్ పవార్ పదవీచ్యుతుడయ్యాడు.పదవి లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వంలోకి మళ్లీ చేరిపోయాడు. ప్రస్తుతం ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వేరే కుంపటి పెట్టారు. బీజేపీతో సై అన్నారు. నిజానికి శరద్ పవార్ ఇప్పటికే రాజకీయాలకు బై చెప్పారు.
దీంతో అజిత్ పవార్ కు స్వేచ్ఛ వచ్చి బీజేపీతో సై అన్నాడు. ఇప్పుడు బీజేపీ కూటమికి జై కొట్టాడు. మళ్లీ ఉపముఖ్యమంత్రి పదవి పొందాడు. అయితే.. ఎన్సీపీ మొత్తం బీజేపీకి మద్దతు ఇస్తోందని అజిత్ పవార్ ప్రకటించినా.. ఆయన అధికారం, పదవి కోసమే ఏక్ నాథ్ షిండే గ్రూప్ తో జత కట్టారని మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. చూద్దాం.. ఎన్నికల లోపు మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.