
PM Modi launches HPV vaccine
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. (ఫిబ్రవరి 28) శనివారం నుంచి దేశవ్యాప్తంగా 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకాను అందించనుంది. ఈ మహత్తర కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని అజ్మీర్ నగరంలో ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ టీకా పంపిణీ జరుగుతుంది. ప్రతి ఏడాది సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో దశలవారీగా సుమారు 6.75 లక్షల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, తెలంగాణలో హైదరాబాద్లో మంత్రి దామోదర రాజనర్సింహా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
HPV vaccine : హెచ్పీవీ టీకాను ప్రారంభించిన ప్రధాని మోడి .. హెచ్పివి టీకా అంటే ఏమిటి .. అది ఏవరికి ప్రయోజనం ..?
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రభుత్వ కేంద్రాల్లో గార్డాసిల్-4 టీకాను ఉచితంగా అందించనున్నారు. ఈ టీకా నాలుగు రకాల హెచ్పీవీ వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. గర్భాశయ క్యాన్సర్ను దాదాపు 98 శాతం వరకు నివారించే సామర్థ్యం ఈ వ్యాక్సిన్కు ఉందని నిపుణులు చెబుతున్నారు. 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు ఈ టీకా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వయస్సులో శరీర రోగనిరోధక శక్తి బలంగా స్పందించడంతో తక్కువ మోతాదుతోనే మెరుగైన రక్షణ లభిస్తుంది. 14 సంవత్సరాల వయస్సులో ఒకే డోసు సరిపోతుందని భావిస్తున్నప్పటికీ, 15 సంవత్సరాలు పైబడిన బాలికలకు రెండు డోసులు అవసరం కావచ్చు. 26 సంవత్సరాల లోపు మహిళలకు ఈ టీకా ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. 2006లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ వ్యాక్సిన్ ఇప్పటివరకు 50 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయింది. 160 దేశాల్లో హెచ్పీవీ టీకా కార్యక్రమం అమలులో ఉంది. వాటిలో 90 దేశాలు సింగిల్ డోస్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ జాబితాలో చేరింది.
భారత్లో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ రెండో అత్యంత సాధారణ క్యాన్సర్గా నమోదవుతోంది. ప్రతి సంవత్సరం సుమారు 80,000 కొత్త కేసులు, 42,000కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల సంఖ్యలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో ఏటా 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనాలు సూచిస్తున్నాయి. హెచ్పీవీ ఇన్ఫెక్షన్, బలహీన రోగనిరోధక శక్తి, హెచ్ఐవీ, ధూమపానం, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, చిన్న వయస్సులో గర్భధారణ వంటి అంశాలు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 30 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సంభోగం తర్వాత అసాధారణ రక్తస్రావం, పీరియడ్స్ మధ్య రక్తస్రావం, దుర్వాసనతో కూడిన యోని ఉత్సర్గ, రుతువిరతి తర్వాత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రారంభ దశలో శస్త్రచికిత్సతో చికిత్స సాధ్యమవుతుండగా ఆలస్యమైతే కీమోథెరపీ అవసరం కావచ్చు. అందుకే బాలికలు తగిన వయస్సులో హెచ్పీవీ టీకా తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవగాహన పెంపొందించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను సమర్థంగా అడ్డుకోవచ్చు. ఈ జాతీయ కార్యక్రమం మహిళల ఆరోగ్య రక్షణలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
Vivo S60 : స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
This website uses cookies.