Home » News » Implementation Of Breakfast Scheme For Anganwadi Children
News

Anganwadi : అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌న్యూస్ .. ఇక పై వారి కోసం సరికొత్త పథకం అమలు ..!

Authored By
Suma
The Telugu News | Updated on: February 28, 2026, 5:26 pm
Advertisement

Anganwadi : తెలంగాణలో అంగన్‌వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్‌) అందించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ విషయాన్ని వెల్లడిస్తూ తొలుత కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి తదుపరి కొత్త ఆర్థిక సంవత్సరంనుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. చిన్నారులలో పోషక లోపాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Anganwadi : అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌న్యూస్ .. ఇక పై వారి కోసం సరికొత్త పథకం అమలు ..!

Anganwadi : కౌమార బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

తెలంగాణను చిన్నారులు, గర్భిణీలు పోషక లోప రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో కౌమార బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అదనపు పోషకాహార పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ శ్రుతి ఓజా తదితర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. అమలులో ఉన్న పథకాల పురోగతి, ఖర్చుల వివరాలు, భవిష్యత్ కార్యాచరణపై జిల్లా అధికారులతో చర్చించారు. ప్రతి రూపాయి నిజంగా లక్ష్యబద్ధంగా వినియోగించబడేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.

Advertisement

Anganwadi : భవనాల నిర్మాణం, ‘సాక్ష్యం అంగన్‌వాడీ’కు వేగం

రాష్ట్రంలో కొత్తగా 2,199 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు కేవలం 500 మాత్రమే పూర్తయ్యాయని వెల్లడించారు. మిగిలిన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి, అన్ని కేంద్రాలను సదుపాయాలతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో భవనాల లేమితో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉందని తెలిపారు. ‘సాక్ష్యం అంగన్‌వాడీ’ కార్యక్రమం కింద అన్ని కేంద్రాల్లో నాణ్యమైన పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా చిన్నారులకు పాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం సానుకూల ఫలితాలు ఇస్తే ఇతర జిల్లాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. అదనంగా బాల్యవివాహాల నిర్మూలనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణను బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో టీజీ ఫుడ్స్ ఛైర్మన్ ఫహీం, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంగన్‌వాడీ వ్యవస్థలో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు పోషకాహార కార్యక్రమాల విస్తరణ ద్వారా చిన్నారుల ఆరోగ్యభద్రతను బలోపేతం చేయాలన్న దిశగా ప్రభుత్వం కట్టుబడి ముందుకు సాగుతోంది.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి