Home » National » She Called Lets Have Fun For A While
National

కాసేపు సరదాగా గడుపుదాము రా అని పిలిచింది .. కట్ చేస్తే జోబులు ఖాళీ చేసింది..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: June 27, 2023, 7:00 pm
Advertisement

సమాజంలో ఒకప్పుడు ప్రేమ పేరుతో ఎక్కువగా వేధింపులు అబ్బాయిల నుంచే ఉండేవి. అయితే కాలం మారుతున్న కొద్దీ సమాజంలోనే ఒక మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అబ్బాయిలకు తామేమి తక్కువ కాదని అమ్మాయిలు కూడా రెచ్చిపోతున్నారు. అబ్బాయిలకు ఎదురు ఎక్కుతూ ప్రేమ పేరుతో వేధింపులు చేస్తూ కొన్నిసార్లు బలాత్కారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా ఆన్ లైన్ లో డబ్బున్న అబ్బాయిలను టార్గెట్ చేసుకొని చాలామంది అమ్మాయిలు దోచుకోవటం ఇటీవల ఎక్కువైపోయింది. దీనిలో భాగంగా జలసాలకు ప్రేమ అనే పేరుతో తిరిగి.. కోరికలు తీర్చుకుంటూ ఆ తర్వాత ఫోటోలు వీడియోలు అంటూ బ్లాక్ మెయిల్ చేసి నగదు కూడా దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

Advertisement

ప్రేమించిన యువకుడిని కాసేపు సరదాగా గడుపుతాము రా అని పిలిచి.. చివరికి కాటికి పంపించింది ఆ యువతీ. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనంతపురం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కి చెందిన విజయ సింగ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఆకర్షణీయమైన జీతంతో పాటు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయని గ్రహించిన భావనా రెడ్డి అతడిని మాయలోకి దింపి ప్రేమలో పడేసింది. ఈ నేపథ్యంలో డేటింగ్ కి వెళదామని ప్రియుడికి ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత గురుడు వచ్చిందే ఛాన్స్ అనుకుని.. ఆమె అడ్రస్ ఇచ్చిన నంది హిల్స్ సమీపంలో రిసార్ట్స్ కి బయలుదేరి.. ఓ కిడ్నాప్ ముఠాకు చిక్కాడు. ఈ రకంగా డేటింగ్ ప్రపోజల్ వెనుక కిడ్నాప్ ప్లాన్ పక్కాగా భావన రెడ్డి వేసి సాఫ్ట్ వేర్ విజయ సింగ్ నీ పక్కా స్కెచ్ తో ఆరుగురు తో కలిసి కిడ్నాప్ చేయించింది.

she called lets have fun for a while

Advertisement

ఆ తర్వాత ఓ నిర్మాణస్యమైన ప్రాంతానికి అతన్నే కిడ్నాపర్లు తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజులపాటు చిత్రవాద చేసి అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి 21 లక్షల నగదును తమ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవడం జరిగింది. నగదు తో పాటు మూడు ల్యాప్ టాప్ లు, మూడు సెల్ ఫోన్ లు ఇంకా 12 గ్రాముల బంగారం గొలుసును తీసుకుని అక్కడ నుంచి కిడ్నాపర్లు ఉడయించారు. జూన్ 16న ప్రారంభమైన కిడ్నాప్ స్కెచ్ 18 వరకు కొనసాగించారు. ఆ తరువాత విడిచి పెట్టడం జరిగింది.

దీంతో బాధితుడు విజయ్ సింగ్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ప్రియురాలు భావన రెడ్డి తో పాటు ఆమెకు సహకరించిన ఆరుగురుపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి