Categories: ExclusiveNationalNews

Summer : రోజురోజుకి నిప్పుల కొలిమిలా మారుతున్న తెలుగు రాష్ట్రాలు.. వ‌డ‌దెబ్బకి ఎంత మంది చ‌నిపోయారంటే..!

Summer : ఎండ‌ల‌కి ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల‌లో సూర్యుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. శుక్రవారం (మే3) ఏపీలోని నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, బండి ఆత్మకూరు లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ప్రకాశం జిల్లాలోని అర్ధవీడులో 47.3°C, వైయస్సార్ జిల్లాలోని చిన్నచెప్పలిలో 47.2°C,నెల్లూరు జిల్లాలోని వేపినాపి అక్కమాంబపురంలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Summer : భానుడి భ‌గ భ‌గ‌

ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండుటెండ‌ల‌కు తోడు ఉక్కపోత కూడా ఎక్కువవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడి భగభగలు.. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. . తెలంగాణలో కూడా సూర్యుడు నిప్పులవాన కురిపిస్తున్నాడు. పెద్దప‌ల్లి, జ‌గిత్యాల, సూర్యాపేట, ఖ‌మ్మం జిల్లాల్లో 46.7 డిగ్రీలు, న‌ల్లగొండ జిల్లాలో 46.6 డిగ్రీలు, మంచిర్యాల, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో 46.5, మ‌హ‌బూబాబాద్, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత‌లు న‌మోదు అయ్యాయి.ఏపీలోనూ రికార్డు స్థాయి టెంపరేచర్స్‌ నమోదు అవుతున్నాయి.

Summer : రోజురోజుకి నిప్పుల కొలిమిలా మారుతున్న తెలుగు రాష్ట్రాలు.. వ‌డ‌దెబ్బకి ఎంత మంది చ‌నిపోయారంటే..!

ఏపీలోని ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 46.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో 46.6 డిగ్రీలు, కడప జిల్లాలో 46.4 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రకటించింది. మరో మూడు, నాలుగు రోజులపాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది. ఎండ‌ల వ‌ల‌న కొంద‌రు వ‌డ‌దెబ్బ‌కి గుర‌వుతున్నారు. గ‌త మూడు రోజులుగా వ‌డ‌దెబ్బ‌తో న‌లుగురు ఐదుగురు మ‌ర‌ణించిన‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. వాటిపై క్లారిటీ లేదు.

Recent Posts

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

36 minutes ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

2 hours ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

3 hours ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

4 hours ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

5 hours ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

6 hours ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

7 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

8 hours ago