Home » National » Who Is Ineligible For Pm Kishan Yojana Money 7 Conditions
National

PM Kisan : PM కిసాన్ యోజన డబ్బుకు ఎవరు అనర్హులు 7 షరతులు

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: May 23, 2024, 9:00 am
Advertisement

PM Kisan  : రైతుల కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో ప్రజాకర్షక పత్రాలను అమలు చేస్తున్నాయి. ఆర్థిక సాయం అందించటానికి ఎన్నో కొత్త పథకాలు వచ్చాయి అని చెప్పొచ్చు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా అర్హులైన రైతులకు సబ్సిడీ ని మంజూరు చేస్తున్నాము అని అయితే కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటేనే వారు అర్హులు అవుతారు అని స్పష్టంగా తెలిపింది. కావున ఎవరు అర్హులు. సాధారణ అర్హత ప్రమాణాలు ఏమిటి. మొదలైన వాటి గురించి తెలుసుకుందాం…

Advertisement

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఆర్థిక సహాయం అనేది అందిస్తున్నారు. దీని కోసమే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయించింది. ప్రతి ఏడాది కిసాన్ సమ్మాన్ యోజన కేంద్రం నుండి మూడు విడతలుగా రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలకు విడుదల చేయటంతో పాటు చాలా మందికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే మూడు లక్షలకు పైగా రైతుల కుటుంబాలకు బ్యాంక్ ఖాతాలకు నగదు అనేది బదిలీ కాగా అందరికీ మాత్రం ఇప్పటివరకు కూడా ఒక్క వాయిదా రాలేదు. దానికి ఒక నిర్దిష్ట కారణం కూడా ఉన్నది. దాని గురించిన సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ పథకం కింద ఇప్పటికే ఒక కుటుంబ సభ్యుడు లబ్ధిదారుడుగా ఉంటే, ఇతర కుటుంబ సభ్యులు ఎవరు కూడా మళ్లీ లబ్ధి పొందలేరు. 18 ఏళ్ల పైబడిన అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు. సొంత సాగు భూమి లేని వారు అనర్హులుగా ప్రకటించారు. EKYC నీ పూర్తి చేయని వారు కూడా దీనికి అనర్హులే. కుటుంబ వార్షిక ఆదాయం మరియు ఆదాయ పన్ను శాఖ నిబంధనలకు మించి ఉన్నట్లయితే వారు కూడా ఈ పథకానికి అనర్హులే. అంతేకాక ఆదాయం వచ్చే ఇతర ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో డాక్టర్లు,ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నట్లయితే వారికి కూడా PM కిసాన్ యోజన అందడం లేదు. సదుపాయం పొందాలి అనే ఉద్దేశంతో నకిలీ ఐడి మరియు పత్రం ఇచ్చినట్లు తెలిస్తే వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ కాదు. ఇప్పటికే ఎక్కువ డబ్బు వచ్చిన,సబ్సిడీ పొందిన వారు ఇతర రైతు అనుకూల పథకాల లబ్ధిదారులు అయినప్పటికీ కూడా డబ్బులు రావు.

Advertisement

PM Kisan : PM కిసాన్ యోజన డబ్బుకు ఎవరు అనర్హులు 7 షరతులు

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన సొమ్మును ప్రభుత్వం ద్వారా ఉపాధి పొందుతున్న వారికి అందుతుందా అనే సందేహాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. వ్యవసాయం మంచి పథకమే అయినప్పుడు ప్రభుత్వం ద్వారా ఉపాధి పొందుతున్న వారికి వ్యవసాయం చేస్తే ఆసరా ఉంటుంది, కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి రాయితీ అనేది ఉండదు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ పదవులను కలిగి ఉన్నవారు మరియు రిటైర్డ్ అధికారులు మరియు ప్రభుత్వ స్వయం ప్రతిపత్త సంస్థ మరియు ఇతరులు కిసాన్ సమ్మాన్ యోజనకు అర్హులు కారు. మొత్తం మీద ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన అనేది ఇప్పటికే ధనవంతులు పన్ను చెల్లించే స్థితిలో ఉన్నప్పటికీ కూడా కిసాన్ సమ్మాన్ యోజన అనేది అనర్హులుగా ఉన్న పేద రైతుల కోసం మాత్రమే రూపొందించబడింది అనే భావన…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి