PM Kisan : రైతుల కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో ప్రజాకర్షక పత్రాలను అమలు చేస్తున్నాయి. ఆర్థిక సాయం అందించటానికి ఎన్నో కొత్త పథకాలు వచ్చాయి అని చెప్పొచ్చు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా అర్హులైన రైతులకు సబ్సిడీ ని మంజూరు చేస్తున్నాము అని అయితే కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటేనే వారు అర్హులు అవుతారు అని స్పష్టంగా తెలిపింది. కావున ఎవరు అర్హులు. సాధారణ అర్హత ప్రమాణాలు ఏమిటి. మొదలైన వాటి గురించి తెలుసుకుందాం…
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఆర్థిక సహాయం అనేది అందిస్తున్నారు. దీని కోసమే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయించింది. ప్రతి ఏడాది కిసాన్ సమ్మాన్ యోజన కేంద్రం నుండి మూడు విడతలుగా రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలకు విడుదల చేయటంతో పాటు చాలా మందికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే మూడు లక్షలకు పైగా రైతుల కుటుంబాలకు బ్యాంక్ ఖాతాలకు నగదు అనేది బదిలీ కాగా అందరికీ మాత్రం ఇప్పటివరకు కూడా ఒక్క వాయిదా రాలేదు. దానికి ఒక నిర్దిష్ట కారణం కూడా ఉన్నది. దాని గురించిన సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ పథకం కింద ఇప్పటికే ఒక కుటుంబ సభ్యుడు లబ్ధిదారుడుగా ఉంటే, ఇతర కుటుంబ సభ్యులు ఎవరు కూడా మళ్లీ లబ్ధి పొందలేరు. 18 ఏళ్ల పైబడిన అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు. సొంత సాగు భూమి లేని వారు అనర్హులుగా ప్రకటించారు. EKYC నీ పూర్తి చేయని వారు కూడా దీనికి అనర్హులే. కుటుంబ వార్షిక ఆదాయం మరియు ఆదాయ పన్ను శాఖ నిబంధనలకు మించి ఉన్నట్లయితే వారు కూడా ఈ పథకానికి అనర్హులే. అంతేకాక ఆదాయం వచ్చే ఇతర ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో డాక్టర్లు,ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నట్లయితే వారికి కూడా PM కిసాన్ యోజన అందడం లేదు. సదుపాయం పొందాలి అనే ఉద్దేశంతో నకిలీ ఐడి మరియు పత్రం ఇచ్చినట్లు తెలిస్తే వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ కాదు. ఇప్పటికే ఎక్కువ డబ్బు వచ్చిన,సబ్సిడీ పొందిన వారు ఇతర రైతు అనుకూల పథకాల లబ్ధిదారులు అయినప్పటికీ కూడా డబ్బులు రావు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన సొమ్మును ప్రభుత్వం ద్వారా ఉపాధి పొందుతున్న వారికి అందుతుందా అనే సందేహాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. వ్యవసాయం మంచి పథకమే అయినప్పుడు ప్రభుత్వం ద్వారా ఉపాధి పొందుతున్న వారికి వ్యవసాయం చేస్తే ఆసరా ఉంటుంది, కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి రాయితీ అనేది ఉండదు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ పదవులను కలిగి ఉన్నవారు మరియు రిటైర్డ్ అధికారులు మరియు ప్రభుత్వ స్వయం ప్రతిపత్త సంస్థ మరియు ఇతరులు కిసాన్ సమ్మాన్ యోజనకు అర్హులు కారు. మొత్తం మీద ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన అనేది ఇప్పటికే ధనవంతులు పన్ను చెల్లించే స్థితిలో ఉన్నప్పటికీ కూడా కిసాన్ సమ్మాన్ యోజన అనేది అనర్హులుగా ఉన్న పేద రైతుల కోసం మాత్రమే రూపొందించబడింది అనే భావన…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.