7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 4 శాతం డీఏ పెరిగిన విషయం తెలిసిందే. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న 2.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 1.90 లక్షల పెన్షనర్ల కోసం డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న 31 శాతం డీఏ 3 శాతం పెరగడంతో ఆ డీఏ కాస్త 34 శాతంగా మారింది. పెరిగిన 3 శాతం డీఏ వల్ల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి అదనంగా రూ.500 కోట్ల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే.. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు అంటే జనవరి, జులైలో డీఏ, డీఆర్ ను సవరిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే డీఏ పెరిగింది. 4 శాతం డీఏ పెరిగింది. పెరిగిన డీఏ.. జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది.
అంటే.. జనవరి 1 నుంచి డీఏ బకాయిలు ఏప్రిల్ జీతంలో జమకానున్నాయి. అయితే.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో 4 శాతం డీఏ.. ఈసంవత్సరం జులైలో పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. డీఏ పెంపుతో పాటు 18 ఏళ్లు పైబడి స్పిటి ప్రాంతాల్లో నివసించే మహిళలకు నెలకు రూ.1500 ఉచితంగా అందిస్తున్నట్టు హిమాచల్ ప్రభుత్వం ప్రకటించింది. దీని వల్ల.. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న 9 వేల మంది మహిళలకు లబ్ది చేకూరనుంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.