
7th Pay Commission central govt to hike fitment factor to employees
7th Pay Commission : ఇటీవల పలు రాష్ట్రాలు డీఏలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులని ఆనందింపజేసే పనిలో పడింది. కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచే ఆలోచనలో ఉండగా, ఇప్పుడు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్ ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది. కేంద్ర ఉద్యోగులకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ చెల్లించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
భారీ పెంపు…
34 శాతం కరువు భత్యం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి దక్కనుండగా, దీని వల్ల రాష్ట్రంలోని 7.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని, రాష్ట్ర ఖజానాపై రూ.625 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 31 శాతం కరువు భత్యం ఉండేదని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్లో లభించే డియర్నెస్ అలవెన్స్ను ఆగస్టు నెల నుంచి వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పెన్షనర్లు కూడా కరువు భత్యం ప్రయోజనం పొందుతారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డియర్నెస్ అలవెన్స్ను 11 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
7th pay commission increases in august
అయితే రానున్న కొద్ది రోజుల్లో కేంద్ర ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ను కూడా 38 నుంచి 39 శాతానికి పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరువు భత్యం పెంపుపై మోదీ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పెంచిన డీఏ ఈనెల నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు నెల నుండి అమలులోకి రానుండగా, ఇది సెప్టెంబర్లో ఉద్యోగులకు అందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. మొత్తానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల డీఏ పెంచే ఆలోచనలు చేస్తుండగా, ఉద్యోగులు చాలా సంతోషిస్తున్నారు.
Vijay Deverakonda : టాలీవుడ్లో అత్యంత క్రేజ్ ఉన్న జంటగా పేరు తెచ్చుకున్నవిజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఇటీవల…
Farmers : తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కీలక చర్యలు చేపడుతోంది.…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతున్న చర్చలు చూస్తుంటే సామాన్యులకు కూడా ఆశ్చర్యం వేస్తోంది. ముఖ్యంగా శాసనమండలి…
Gold and Silver Rate Today 8 March 2026 : గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చి,…
Raw Onions : వేసవికాలం ప్రారంభమయ్యే సరికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు,…
Spinach : వేసవి కాలం మొదలైతే ఎండలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శరీరాన్ని అలసటకు గురిచేయడమే కాకుండా…
zodiac signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన గ్రహాల కలయికలు…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
This website uses cookies.