7th Pay Commission : ఇటీవల పలు రాష్ట్రాలు డీఏలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులని ఆనందింపజేసే పనిలో పడింది. కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచే ఆలోచనలో ఉండగా, ఇప్పుడు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్ ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది. కేంద్ర ఉద్యోగులకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ చెల్లించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
భారీ పెంపు…
34 శాతం కరువు భత్యం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి దక్కనుండగా, దీని వల్ల రాష్ట్రంలోని 7.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని, రాష్ట్ర ఖజానాపై రూ.625 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 31 శాతం కరువు భత్యం ఉండేదని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్లో లభించే డియర్నెస్ అలవెన్స్ను ఆగస్టు నెల నుంచి వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పెన్షనర్లు కూడా కరువు భత్యం ప్రయోజనం పొందుతారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డియర్నెస్ అలవెన్స్ను 11 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే రానున్న కొద్ది రోజుల్లో కేంద్ర ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ను కూడా 38 నుంచి 39 శాతానికి పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరువు భత్యం పెంపుపై మోదీ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పెంచిన డీఏ ఈనెల నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు నెల నుండి అమలులోకి రానుండగా, ఇది సెప్టెంబర్లో ఉద్యోగులకు అందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. మొత్తానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల డీఏ పెంచే ఆలోచనలు చేస్తుండగా, ఉద్యోగులు చాలా సంతోషిస్తున్నారు.
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
This website uses cookies.