Andhra Pradesh : వైఎస్సార్ సీపీ ప్రెస్ నోట్, ఏపీలో విద్యా విప్లవం 4,59,564 మంది విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ, 59,176 టీచర్లకు బోధనకు సాయపడేలా ఉచిత ట్యాబ్లు 5,18,740 ట్యాబ్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం జగన్ సీఎం జగన్ 50వ పుట్టిన రోజున పంపిణీకి శ్రీకారం ఏపీలో విద్యా విప్లవం మొదలైంది. చదువులు అంటే ప్రభుత్వానికి ఖర్చు కాదు. అదో గురుతర బాధ్యత. ప్రతి చిన్నారి కుటుంబానికి పిల్లలను చదివే ఆర్థిక అండ కల్పిస్తూ నాణ్యమైన చదువులు అందించే పాఠశాలను అభివ`ద్ధి చేయడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లక్ష్యం. ఇది బావితరాల ఉజ్వల భవితకు బాటలుగా భావిస్తున్నాం. సీఎం జగన్, రాష్ర్ట ముఖ్యమంత్రి పుట్టిన రోజు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయల
నేతల మధ్య కోలాహలం కాకుండా సీఎం జగన్ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.విద్యార్థుల బంగారు భవితకు పునాదులు వేసే ఓ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాపట్ల జిల్లా, చుండూరు మండలం, యడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో రాష్ర్ట వ్యాప్తంగా 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు, 59,176 టీచర్లకు మొత్తంగా 5,18,740 ట్యాబ్ల పంపిణీని సీఎం జగన్ బుధవారం నాడు ప్రారంభించారు. బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో అందించనున్న ఈ ట్యాబ్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 1,466 కోట్ల ఖర్చు చేసినట్లు స్థానిక బహిరంగ సభలో సీఎం జగన్ తెలిపారు. 2019 నుంచి పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణల హోస్ట్లో భాగంగా టాబ్లెట్లను పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు స్థూల నమోదు నిష్పత్తి (GER) పెంచడానికి, అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సాయం తోడ్పడుతోంది. ఈ పథకం ద్వారా 45 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరగా అమ్మఒడి పథకం కోసం రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 19,617.6 కోట్లు ఖర్చు చేసింది.
నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించేలా వరల్డ్ క్లాస్ విద్యా బోధన అందించేలా రూ. 3,669 కోట్లను ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఖర్చు చేసింది. ‘మన బడి నాడు-నేడు’ కార్యక్రమం మొదటి దశ కింద 15,715 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పన పూర్తయ్యింది. రెండవ దశ కింద 11 అదనపు భాగాల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. మరో రూ. 8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టారు. మొత్తం మన బడి నాడు నేడు పథకం కింద ప్రభుత్వం రూ. 1,237.95 కోట్లు ఖర్చు చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన ఆహారం అందిస్తోంది. రాష్ర్ట ప్రభుత్వం ‘జగనన్న గోరుముద్ధ’ పథకం కింద పునరుద్ధరించిన మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు చేస్తోంది. ఈ పథకం కింద వారానికి ఐదు గుడ్లు, మూడు చిక్కిలు విద్యార్థులకు అందిస్తున్నారు. డైలీ అలవెన్స్ (RDA) కంటే అధిక పోషక విలువలు కలిగిన దాదాపు 15 రకాల వస్తువులను అందించడం కోసం ఏడాదికి రూ. 1,800 కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యా కానుక కిట్లు : విద్యా కానుక పథకం కింద ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు అందిస్తోంది. ఒక్కో కిట్లో స్కూల్ బ్యాగ్,
మూడు జతల యూనిఫాం, స్టిచింగ్ ఛార్జ్, బెల్ట్, ఒక జత షూ మరియు రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, వర్క్బుక్లు, ఇంగ్లీషు నుంచి తెలుగు అనువాదం ఉన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం 45 లక్షల మంది విద్యార్థులకు అందించే ఈ విద్యా కానుక కిట్ల కోసం ఇప్పటి వరకు రూ.2,323.99 కోట్లు ఖర్చు చేసింది. – విద్యా సంస్కరణలు : ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యా విధానంలో అనేక సంస్కరణలను అమలు చేసింది. 1 నుంచి 8 వ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాలు భవిష్యత్తులో విద్యార్థులను ఇంగ్లీష్ మీడియంలోకి పూర్తి స్థాయిలో తెచ్చేలా ద్విభాషాపరంగా రూపొందించబడ్డాయి.
-2024-25 విద్యా సంవత్సరంలో CBSE పద్ధతిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షకు హాజరవుతున్నందున విద్యార్థులందరికీ, ముఖ్యంగా ప్రస్తుతం 8వ తరగతిలో ఉన్న వారికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించబడుతోంది. 8 వ తరగతి నుంచి NCERT సిలబస్ తో రూపొందిచంిన పాఠ్య పుస్తకాలను ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు కంటెంట్తో అందిస్తున్నారు. -జాతీయ విద్యా విధానం (NEP) సిఫార్సుల ప్రకారం 3వ తరగతి నుండి అన్ని తరగతులకు అర్హత కలిగిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులను అందించడానికి పరిపాలనా సంస్కరణ నిర్ణయాలను రాష్ర్ట ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను 5:3:3:4 నమూనాలో ఆరు రకాలుగా వర్గీకరించింది.
వాటిలో శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ (PP1 & PP2), ఫౌండేషన్ స్కూల్ (PP1, PP2, క్లాస్ 1 & 2), ఫౌండేషన్ స్కూల్ ప్లస్ (PP1, PP2, క్లాసులు 1 నుండి 5 వరకు), ప్రీ-హై స్కూల్ (తరగతులు 3 నుండి 7/8) , హై స్కూల్ (తరగతులు 3 నుండి 10 వరకు) మరియు హై స్కూల్ ప్లస్ (తరగతులు 3 నుండి 12 వరకు) ఉన్నాయి. – పాఠశాల విద్యా శాఖ పరిధిలోని ఉపాధ్యాయుల పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) విద్యా రంగంలో పరివర్తనాత్మక మార్పును తేనుంది. దీని కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించే కామన్ గ్రేడింగ్ సిస్టమ్ అమలు నాణ్యతను మరింత పెంచనుంది. -రాష్ర్ట ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో 2017-18లో ఆంధ్రప్రదేశ్ మొత్తం స్కోరు 728. 2020-21లో 902 స్కోరు సాధించి దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.