ఈ ఒక్క పనితో జగన్ ఏపీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు?

Advertisement
Advertisement

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఒక్క పనిని సమర్థంగా నిర్వహించారంటే ఆయన చరిత్రలో మిగిలిపోతారు. ఏపీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఏపీ ప్రజలు ఎన్నటికీ జగన్ ను మరిచిపోరు. అదే భూముల సమగ్ర రీసర్వే. అవును.. ముఖ్యమంత్రి జగన్ ను, ఆయన పాలనను ఏపీ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలంటే.. ఏపీ వ్యాప్తంగా ఒక్క ఎకరాన్ని కూడా వదలకుండా.. భూముల రీసర్వే చేయించడమే. దాని వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి.

Advertisement

ap cm jagan will be remembered forever for this work

భూసమస్యల వల్ల ఎటువంటి అనర్థాలు చోటు చేసుకుంటాయో అందరికీ తెలిసిందే. భూసమస్యలనేవి ఇప్పుడు వచ్చినవి కావు.. దశాబ్దాల నుంచి రైతులను వెంటాడుతున్న సమస్యలు ఇవి. వీటికి చెక్ పెట్టాలంటే.. ఏపీలోని ప్రతి అంగుళాన్ని మళ్లీ సర్వే చేయించడమే. అప్పుడే భూసమస్యలకు చెక్ పెట్టొచ్చు.

Advertisement

వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం

అందుకే.. సీఎం జగన్ తన పుట్టిన రోజు అంటే డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకానికి శ్రీకారం చుట్టారు. అసలు.. ఏపీ చరిత్రలోనే కాదు.. దేశంలోనే అతి పెద్ద భూరీసర్వే ఇది. దాన్ని జగన్ సర్కారు ప్రారంభించడం నిజంగా ప్రశంసనీయం.

మొత్తం మూడు దశల్లో భూరీసర్వేను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. మొదటి దశలో 5122 గ్రామాల్లో భూసర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండో దశలో 6000 గ్రామాల్లో నిర్వహిస్తారు. అనంతరం మూడో దశలో భాగంగా.. మిగిలిన గ్రామాల్లో సర్వే ఉంటుంది. మూడు దశల్లో భూరీసర్వే పూర్తవడానికి కనీసం 2023 అగస్టు వరకు సమయం పడుతుందని అంచాన వేశారు.

అటవీ ప్రాంతం మినహా.. మిగితా భూమి మొత్తం రీసర్వే

అయితే.. అటవీ ప్రాంతాన్ని మాత్రం ఈ భూరీసర్వే ప్రాజెక్టులో పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని వదిలేసి… కేవలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములను, ఇళ్లను అత్యాధునిక సర్వే పరికరాలతో కొలవనున్నారు. సర్వేతో పాటే వెంటనే హద్దు రాళ్లను కూడా ప్రభుత్వమే వేయిస్తుంది. దీంతో.. శాశ్వతంగా భూసమస్యలకు ఇక చెక్ పడినట్టే.

ఈ ప్రాజెక్టు సక్సెస్ ఫుల్ గా పూర్తయితే.. సీఎం జగన్ ఎక్కడికో వెళ్లిపోతారు. ఏపీ చరిత్రలోనే ఎవ్వరూ చేయని సాహసం చేసిన సీఎం జగన్ కు ఏపీ రైతులు బ్రహ్మరథం పడతారు.

Advertisement

Recent Posts

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

30 minutes ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

2 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

3 hours ago

MSVPG : వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటున్న చిరు ఫ్యాన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్

Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…

4 hours ago

Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. బీజేపీ ఆగ్ర‌హం..!

Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…

5 hours ago

Ibomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్

Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…

5 hours ago

Ajit Pawar : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి

Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. బుధవారం…

6 hours ago

Perni Nani : పేర్ని నాని ని అరెస్ట్ చేయబోతున్నారా ?

Perni Nani : గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెపుతున్నారు. సీఎం…

7 hours ago