
why ys jagan is confused with upcoming elections
YS Jagan : సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు ఇలా పలు అంశాలు అప్పట్లో చాలా కీలకమైనవిగా ఉన్నాయి. అందుకే.. తన పార్టీని 25 పార్లమెంట్ స్థానాల్లో గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి అయినా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని వైఎస్ జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు.
ఏది ఏమైనా.. వైసీపీకి 2019 ఎన్నికల్లో 22 లోక్ సభ స్థానాలు వచ్చాయి. 22 మంది వైసీపీ ఎంపీలు గెలిచారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై ముఖ్యంగా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ముఖ్యమంత్రిగా జగన్ నిలదీస్తారని అందరూ భావించారు. అందుకే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో సహా.. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలను జగన్ కలిశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు.
ap cm ys jagan delhi visit for ap development
సీఎం అయిన తర్వాత కేంద్రంతో మాట్లాడిన జగన్.. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిందని, ఈ సమయంలో ప్రత్యేక హోదా కోసం వాళ్లను రిక్వెస్ట్ చేయడం తప్పితే కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి లేదని మీడియాతో చెప్పారు. జగన్ మాటలు విని ఏపీ మొత్తం షాక్ అయిపోయింది. కట్ చేస్తే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో జగన్ నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరించారు.
తాజాగా మళ్లీ ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు లాంటి అంశాలు తెరమీదికి వచ్చాయి. సోమవారం సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధుల సాధనే లక్ష్యంగా ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. విభజన చట్టంలోని పలు పెండింగ్ అంశాలను కూడా వెంటనే పరిష్కరించాలని ప్రధానిని జగన్ కోరనున్నాట్టు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. మరి.. భేటీ తర్వాత ఏపీ విషయంలో జగన్ ఎలా వ్యవహరిస్తారో.. ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరొక రోజు వేచి చూడాల్సిందే.
Vijaya Milk : తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా పాడి రైతులకు అండగా…
YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో నమ్మకానికి మారుపేరుగా ఉన్న విజయ డైరీ ఉత్పత్తుల విషయంలో ఇప్పుడు కొత్త…
Tirumala : తిరుమల శ్రీవారి కి భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల విషయంలో ఒక సంచలనమైన దొంగతనం వెలుగులోకి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కొంచెం సైలెంట్ గా ఉన్న…
TKGKS - KANA - Khammam : ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ…
Revanth Reddy : హైదరాబాద్ నగరం మరో అద్భుతమైన వినోద కేంద్రానికి వేదిక కాబోతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…
Sardar Papanna statue : తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప వీరుల్లో సర్దార్ సర్వాయి పాపన్న…
IPL 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన…
HPCL Recruitment 2026 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ…
Central Govt : దేశంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఇంధనాల కృతిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
PM Shram Yogi Mandhan Yojana : దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై యాంకర్గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించిన రష్మి గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో…
This website uses cookies.