YS Jagan : మొహమాటం లేకుండా జగన్ ని ట్రోల్ చేస్తున్న జగన్ వీరాభిమానులు?

YS Jagan : సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు ఇలా పలు అంశాలు అప్పట్లో చాలా కీలకమైనవిగా ఉన్నాయి. అందుకే.. తన పార్టీని 25 పార్లమెంట్ స్థానాల్లో గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి అయినా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని వైఎస్ జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు.

ఏది ఏమైనా.. వైసీపీకి 2019 ఎన్నికల్లో 22 లోక్ సభ స్థానాలు వచ్చాయి. 22 మంది వైసీపీ ఎంపీలు గెలిచారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై ముఖ్యంగా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ముఖ్యమంత్రిగా జగన్ నిలదీస్తారని అందరూ భావించారు. అందుకే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో సహా.. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలను జగన్ కలిశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు.

ap cm ys jagan delhi visit for ap development

YS Jagan : ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై వెనక్కి తగ్గిన జగన్

సీఎం అయిన తర్వాత కేంద్రంతో మాట్లాడిన జగన్.. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిందని, ఈ సమయంలో ప్రత్యేక హోదా కోసం వాళ్లను రిక్వెస్ట్ చేయడం తప్పితే కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి లేదని మీడియాతో చెప్పారు. జగన్ మాటలు విని ఏపీ మొత్తం షాక్ అయిపోయింది. కట్ చేస్తే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో జగన్ నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరించారు.

తాజాగా మళ్లీ ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు లాంటి అంశాలు తెరమీదికి వచ్చాయి. సోమవారం సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధుల సాధనే లక్ష్యంగా ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. విభజన చట్టంలోని పలు పెండింగ్ అంశాలను కూడా వెంటనే పరిష్కరించాలని ప్రధానిని జగన్ కోరనున్నాట్టు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. మరి.. భేటీ తర్వాత ఏపీ విషయంలో జగన్ ఎలా వ్యవహరిస్తారో.. ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరొక రోజు వేచి చూడాల్సిందే.

Recent Posts

Health Tips | యాలకులు .. కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా ఓ అద్భుత ఔషధం!

Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…

36 minutes ago

Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే స‌మస్య‌ల‌న్నీ మాయం

Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…

2 hours ago

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

3 hours ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

12 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

13 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

14 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

16 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

17 hours ago