why ys jagan is confused with upcoming elections
YS Jagan : సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు ఇలా పలు అంశాలు అప్పట్లో చాలా కీలకమైనవిగా ఉన్నాయి. అందుకే.. తన పార్టీని 25 పార్లమెంట్ స్థానాల్లో గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి అయినా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని వైఎస్ జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు.
ఏది ఏమైనా.. వైసీపీకి 2019 ఎన్నికల్లో 22 లోక్ సభ స్థానాలు వచ్చాయి. 22 మంది వైసీపీ ఎంపీలు గెలిచారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై ముఖ్యంగా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ముఖ్యమంత్రిగా జగన్ నిలదీస్తారని అందరూ భావించారు. అందుకే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో సహా.. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలను జగన్ కలిశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు.
ap cm ys jagan delhi visit for ap development
సీఎం అయిన తర్వాత కేంద్రంతో మాట్లాడిన జగన్.. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిందని, ఈ సమయంలో ప్రత్యేక హోదా కోసం వాళ్లను రిక్వెస్ట్ చేయడం తప్పితే కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి లేదని మీడియాతో చెప్పారు. జగన్ మాటలు విని ఏపీ మొత్తం షాక్ అయిపోయింది. కట్ చేస్తే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో జగన్ నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరించారు.
తాజాగా మళ్లీ ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు లాంటి అంశాలు తెరమీదికి వచ్చాయి. సోమవారం సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధుల సాధనే లక్ష్యంగా ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. విభజన చట్టంలోని పలు పెండింగ్ అంశాలను కూడా వెంటనే పరిష్కరించాలని ప్రధానిని జగన్ కోరనున్నాట్టు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. మరి.. భేటీ తర్వాత ఏపీ విషయంలో జగన్ ఎలా వ్యవహరిస్తారో.. ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరొక రోజు వేచి చూడాల్సిందే.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.