
ap cm ys jagan very serious about exams
ys jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా ప్రజామోధకరమైన పరిపాలన కొనసాగిస్తున్నాడు. అన్ని కూడా ప్రజలు కోరుకుంటున్నట్లుగా జరుగుతున్నాయి. కాని ఒక్క విషయంలో మాత్రం వారి అభిప్రాయం పట్టించుకోకుండా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొండిగా ప్రవర్తిస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అవే 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు. కరోనా కరాళ నృతం చేస్తున్న ఈ సమయంలో ఏపీలో పరీక్షలు నిర్వహించాల్సిందే అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో ఉండటం విమర్శలకు తావిస్తుంది.
ఏపీలో ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుగు దేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ అన్నారు. కరోనా తో జనాలు చనిపోతూ ఉంటే పిల్లల ప్రాణాల పట్ల ఏమాత్రం బాధ్యత లేదా అంటూ జనాలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. అయినా కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం పట్టించుకోకుండా మొండిగా పరీక్షలు పెట్టేందుకు సిద్దం అయ్యాడు అంటూ ఆరోపించాడు. పరీక్షలు మొండిగా పెట్టేందుకు ప్రయత్నిస్తే ఆందోళనకు దిగుతాం అంటూ లోకేష్ హెచ్చరించాడు.
ap cm ys jagan very serious about exams
తెలంగాణతో పాటు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏపీలో మాత్రం పరీక్షలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. పరీక్షల తేదీలు ప్రకటించారు. ఆ తేదీల్లో ఖచ్చితంగా పరీక్షలు జరుగుతాయని అంటున్నారు. విద్యా సంస్థలు నడిచింది తక్కువ రోజులు అయినా కూడా పరీక్షలు పెడతాం అంటే ఎలా అంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరీక్షల రద్దును కోరుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ విషయమై విమర్శలు తప్పేలా లేవు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.