ys jagan mohan reddy
ys Jagan mohan reddy : కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మృతుల సంఖ్య కూడా ఆందోళనకర స్థితిలో ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సగటుతో పోల్చితే ఏపీలో నమోదు అవుతున్న మృతుల సగటు చాలా తక్కువ ఉంది. ఇప్పటి వరకు ఏపీలో నమోదు అయిన కేసులతో లెక్క వేస్తే మరణాల రేటు అత్యంత స్వల్పం అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కరోనా గణాంకాలు కూడా అదే విషయాన్ని చెబుతున్నట్లుగా ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దేశంలోనే కరోనా మరణాల నియంత్రణ విషయంలో ఏపీ ది బెస్ట్ అంటూ వారు చెబుతున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు మరియు ఆయన ముందు చూపు వల్లే కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉండటంతో పాటు కేసులు కూడా తక్కువ నమోదు అవుతున్నట్లుగా వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోన కేసులు 10,20,926 నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 9,31,839 మంది కోలుకున్నారు. ప్రస్తుతం వివిద ఆసుపత్రుల్లో మరియు స్వీయ నిర్భందంలో 81,471 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారిలో 92.53 శాతం రికవరీ అవ్వడం ఖచ్చితంగా ప్రభుత్వ చర్యలే కారణం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ys jagan mohan reddy
పక్క రాష్ట్రం తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో కరోనా రికవరీల రేటు చాలా అధికంగా ఉండటం ను గమనించవచ్చు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చర్యల వల్లే కేసులు అధికంగా నమోదు అవ్వలేదు అని, అలాగే కరోనా సోకిన వారికి వెంటనే చికిత్స అందించడంతో పాటు అన్ని విధాలుగా ఆదుకోవడం వల్లే మరణాల రేటు తక్కువగా ఉందని అంటున్నారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన పక్కా ప్రాణాళికను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కరోనాతో పోరాటంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించినట్లే అంటున్నారు.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.