
ys Jagan rachamallu sivaprasad reddy fires chandra babu about viveka case
Ys Jagan : ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో గతంలో నందమూరి తారక రామారావు మరియు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహంకు గురి అయిన వారే. కేవలం ఏపీలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం వల్ల గద్దె దిగిన ముఖ్యమంత్రులు ఉన్నారు. అందుకే అన్ని ప్రభుత్వాలు కూడా వారిని మచ్చిక చేసుకుని వారితో సానుకూలంగా ఉంటూ పనులు చేయించుకుంటూ ఉంటారు. వారు కోరినంత కాకున్నా వారికి సంతోషం కలిగించేంత జీతాలు పెంచుతూ పీఆర్సీ ని అమలు చేస్తూ ఉద్యోగుల విషయంలో సానుకూలంగా ఉంటూ ఉంటారు. ఈ సమయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గత అనుభవాలు దృష్టి లో పెట్టుకుని కూడా జగన్ ఉద్యోగులతో వివాదం పెట్టుకుంటున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా కూడా ఉద్యోగుల విషయాల్లో ఎలాంటి మెరుగు లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచడం అనేది ప్రభుత్వ బాధ్యత అంటూ ఉద్యోగస్తులు పీఆర్సీ కి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జీతాల పెంపు విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపు విషయం లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకున్నా సరిపోయేది.. ఇప్పుడు పెంపు నిర్ణయం తీసుకుని ఉద్యోగస్తుల ఆగ్రహం కు గురి అవ్వాల్సి వస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండటం వల్ల ఆయనకు వ్యతిరేంగా పని చేశారు అనేది టాక్.. ఇప్పుడు జగన్ కు అదే తప్పదేమో.
ap government employees angry on cm ys jagan
జగన్ ప్రభుత్వం నుండి ఉద్యోగులు ఆశించిన పెంపులో కనీసం 25 శాతం కూడా దక్కలేదు అనేది రాజకీయ మరియు ఉద్యోగ వర్గాల వారి టాక్. అస్సలు ఉద్యోగస్తులు మరియు పెన్షనర్స్ అంటే ప్రభుత్వంకు ఎందుకు కోపం అన్నట్లుగా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్క ఉద్యోగి మనోభావాలు దెబ్బ తినే విధంగా జగన్ ప్రభుత్వం పనులు చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తిపున్యానికి పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అంటూ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కొందరు చేసిన వ్యాఖ్యలు వారికి కోపం తెప్పించాయి. ఈ కోపం వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే కచ్చితంగా జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కష్టం అవుతుంది. ఎన్నికలకు ఎలాగూ సమయం ఉంది కనుక ఖచ్చితంగా మార్పు వస్తుందని వైకాపా నాయకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో అనేది చూడాలి.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.