ys Jagan rachamallu sivaprasad reddy fires chandra babu about viveka case
Ys Jagan : ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో గతంలో నందమూరి తారక రామారావు మరియు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహంకు గురి అయిన వారే. కేవలం ఏపీలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం వల్ల గద్దె దిగిన ముఖ్యమంత్రులు ఉన్నారు. అందుకే అన్ని ప్రభుత్వాలు కూడా వారిని మచ్చిక చేసుకుని వారితో సానుకూలంగా ఉంటూ పనులు చేయించుకుంటూ ఉంటారు. వారు కోరినంత కాకున్నా వారికి సంతోషం కలిగించేంత జీతాలు పెంచుతూ పీఆర్సీ ని అమలు చేస్తూ ఉద్యోగుల విషయంలో సానుకూలంగా ఉంటూ ఉంటారు. ఈ సమయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గత అనుభవాలు దృష్టి లో పెట్టుకుని కూడా జగన్ ఉద్యోగులతో వివాదం పెట్టుకుంటున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా కూడా ఉద్యోగుల విషయాల్లో ఎలాంటి మెరుగు లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచడం అనేది ప్రభుత్వ బాధ్యత అంటూ ఉద్యోగస్తులు పీఆర్సీ కి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జీతాల పెంపు విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపు విషయం లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకున్నా సరిపోయేది.. ఇప్పుడు పెంపు నిర్ణయం తీసుకుని ఉద్యోగస్తుల ఆగ్రహం కు గురి అవ్వాల్సి వస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండటం వల్ల ఆయనకు వ్యతిరేంగా పని చేశారు అనేది టాక్.. ఇప్పుడు జగన్ కు అదే తప్పదేమో.
ap government employees angry on cm ys jagan
జగన్ ప్రభుత్వం నుండి ఉద్యోగులు ఆశించిన పెంపులో కనీసం 25 శాతం కూడా దక్కలేదు అనేది రాజకీయ మరియు ఉద్యోగ వర్గాల వారి టాక్. అస్సలు ఉద్యోగస్తులు మరియు పెన్షనర్స్ అంటే ప్రభుత్వంకు ఎందుకు కోపం అన్నట్లుగా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్క ఉద్యోగి మనోభావాలు దెబ్బ తినే విధంగా జగన్ ప్రభుత్వం పనులు చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తిపున్యానికి పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అంటూ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కొందరు చేసిన వ్యాఖ్యలు వారికి కోపం తెప్పించాయి. ఈ కోపం వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే కచ్చితంగా జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కష్టం అవుతుంది. ఎన్నికలకు ఎలాగూ సమయం ఉంది కనుక ఖచ్చితంగా మార్పు వస్తుందని వైకాపా నాయకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో అనేది చూడాలి.
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
This website uses cookies.