AP Govt enquiry on kathi mahesh death
kathi mahesh సినీ విమర్శకుడు కత్తి మహేశ్ kathi mahesh మరణం పలు అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో న్యాయ విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ చేసిన డిమాండ్కు ఏపీ ప్రభుత్వం స్పందించింది. చిత్తూరు జిల్లాలోని కత్తి మహేశ్ స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. కత్తి మహేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ, సీఎం జగన్ కోసం ప్రచారం చేశారని, అలాంటి వ్యక్తి చనిపోతే సీఎం జగన్ కనీసం సంతాప ప్రకటన కూడా చేయలేదని మందకృష్ణ మాదిగ విమర్శించారు.
కత్తి మహేశ్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కత్తి మహేశ్ ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవర్ సురేశ్ స్వల్పగాయాలతో బయటపడటం, ఎడమ వైపు కూర్చున్న మహేశ్ kathi mahesh కు తీవ్రంగా గాయపడటం అనుమానాలకు తావిస్తోందని మంద కృష్ణ మాదిగ అన్నారు. కత్తి మహేశ్ kathi mahesh కు చాలామంది శత్రువులున్నారని.. గతంలోనూ కత్తి మహేశ్ పై అనేక దాడులు జరిగాయని మంద కృష్ణ మాదిగ గుర్తుచేశారు. ఈ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. మందకృష్ణ మాదిగ డిమాండ్పై స్పందించిన వైఎస్ జగన్ సర్కార్… కత్తి మహేశ్ మరణంపై విచారణకు ఆదేశించింది.
AP Govt enquiry on kathi mahesh death
దీంతో కత్తి మహేష్ కారు ప్రమాదంపై నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం రోజున కారు నడిపిన సురేష్ను పోలీసులు విచారిస్తున్నారు. కత్తి మహేశ్ కారు డ్రైవర్ సురేష్ను విచారణకు పిలిచారు. ప్రమాదం జరిగిన తీరు, కత్తి మహేష్ తీవ్రంగా గాయపడితే డ్రైవర్ సురేష్కు ఎందుకు చిన్నగాయం కూడా కాలేదన్నది అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం తర్వాత ఏం జరిగిందన్న దానిపైనా పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కత్తి మహేష్ మృతిపై తమకూ అనుమానాలున్నాయని కత్తి మహేష్ తండ్రి ఓబులేసు పేర్కొన్నారు.
మహేష్ చనిపోయిన విషయాన్ని తమకంటే ముందే బయటకు చెప్పారని తెలిపారు. కత్తి మహేశ్ మృతిపై న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని ఓబులేసు కోరారు. అయితే సోషల్ మీడియాలో కూడా కత్తి మహేశ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి వరకు బాగున్న మనిషి ఉన్నట్టుండి ఎలా చనిపోయారని, దీనిపై వైద్యులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కత్తి మహేష్ మరణంపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ డిమాండ్ చేస్తున్నారు.
AP Govt enquiry on kathi mahesh death
చనిపోవడానికి ముందు రోజు ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కత్తి మహేష్ మేనమామ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మేనల్లుడు బాగున్నాడని.. వైద్యానికి స్పందిస్తున్నాడని.. మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తానని వైద్యులు చెప్పారని తెలిపారు. కానీ అంతలోనే చనిపోయారని చెప్పారంటూ.. అసలు ఆక్సిజన్ తొలగించిన తర్వాత ఏమైందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత కత్తి మహేశ్ కు చేసిన సర్జరీలు అన్నీ సక్సెస్ అయ్యాయి.
కానీ ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల కత్తి మహేష్ మరణించారని వైద్యులు తెలిపారు. అయితే ఆయన సన్నిహితులతో పాటు కొందరు బంధువులు కూడా కత్తి మహేష్ మృతి వెనుక ఏదో మిస్టరీ ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. కత్తి మహేష్ మృతిపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసుల విచారణలో గానీ, వైద్యుల హెల్త్ బులెటిన్ లో గానీ ఏం జరిగిందన్న విషయం బయటపడుతుందని కత్తి మహేష్ అభిమానులు భావిస్తున్నారు.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.