
ap govt key decision over land for house sites in amaravathi
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. ఇప్పటి నుంచే ఎన్నికలకు అమరావతి కేంద్రంగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అమరావతి భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ 5 జోన్ భూముల కేటాయింపుపై అనుకూల తీర్పు వచ్చింది. దీంతో ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 50 వేల మంది పేదలకు రాజధానిలో ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో 1134 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మరో 268 ఎకరాల భూమిని కేటాయించేందుకు నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
ap govt key decision over land for house sites in amaravathi
268 ఎకరాల భూకేటాయింపుపై ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల యంత్రాంగాల నుంచి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు తాజాగా ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లోని 268 ఎకరాల భూములకు ధర ప్రకారం భూములను కేటాయించనున్నారు. ఎస్ 3 జోన్ అయితే.. ఎకరం ధర రూ.4.1 కోట్లకు గత నెల ఏప్రిల్ 3న జరిగిన సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పుడు మాత్రం అందులో 6 శాతం ధరకు.. ఎకరానికి రూ.24.40 లక్షల చొప్పున 268 ఎకరాలను ప్రభుత్వానికి విక్రయించడానికి సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల కోసం వెచ్చించిన మౌలిక ధరలో కేవలం 6 శాతానికే విక్రయించడం కోసం సీఆర్డీఏ నిర్ణయించింది. దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి 168 ఎకరాలకు ప్రతిపాదన వచ్చింది. బోరుపాలెం నుంచి 2.05 ఎకరాలకు ప్రతిపాదన వచ్చింది. పిచ్చుకలపాలెంలో 20.47 ఎకరాలు, 81.09 ఎకరాలు, అనంతవరంలో 64.39 ఎకరాలను కేటాయించారు. నెక్కల్లులో 100 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లలో 168 ఎకరాలకు రూ.41.33 కోట్లు, మొత్తంగా 268 ఎకరాలకు గాను రూ.65.93 కోట్లుగా సీఆర్డీఏ నిర్ధారించింది. పేదలకు ఇచ్చేందుకు లైన్ క్లియర్ కావడంతో ఆర్ 5 జోన్ భూములను పేదలకు పంచేందుకు ఏపీ ప్రభుత్వం ఈనెల 18న ముహూర్తం పెట్టింది.
Peddi Ticket Price Hike : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana…
Healthy Masala Milk : ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లలు, యువత, వృద్ధులు పోషకాహారాన్ని…
Banana vs Dates : ఉదయం లేచిన వెంటనే మనం తీసుకునే ఆహారం రోజంతా శరీర పనితీరుపై ప్రభావం చూపుతుంది.…
Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
This website uses cookies.