ap govt key decision over land for house sites in amaravathi
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. ఇప్పటి నుంచే ఎన్నికలకు అమరావతి కేంద్రంగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అమరావతి భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ 5 జోన్ భూముల కేటాయింపుపై అనుకూల తీర్పు వచ్చింది. దీంతో ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 50 వేల మంది పేదలకు రాజధానిలో ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో 1134 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మరో 268 ఎకరాల భూమిని కేటాయించేందుకు నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
ap govt key decision over land for house sites in amaravathi
268 ఎకరాల భూకేటాయింపుపై ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల యంత్రాంగాల నుంచి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు తాజాగా ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లోని 268 ఎకరాల భూములకు ధర ప్రకారం భూములను కేటాయించనున్నారు. ఎస్ 3 జోన్ అయితే.. ఎకరం ధర రూ.4.1 కోట్లకు గత నెల ఏప్రిల్ 3న జరిగిన సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పుడు మాత్రం అందులో 6 శాతం ధరకు.. ఎకరానికి రూ.24.40 లక్షల చొప్పున 268 ఎకరాలను ప్రభుత్వానికి విక్రయించడానికి సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల కోసం వెచ్చించిన మౌలిక ధరలో కేవలం 6 శాతానికే విక్రయించడం కోసం సీఆర్డీఏ నిర్ణయించింది. దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి 168 ఎకరాలకు ప్రతిపాదన వచ్చింది. బోరుపాలెం నుంచి 2.05 ఎకరాలకు ప్రతిపాదన వచ్చింది. పిచ్చుకలపాలెంలో 20.47 ఎకరాలు, 81.09 ఎకరాలు, అనంతవరంలో 64.39 ఎకరాలను కేటాయించారు. నెక్కల్లులో 100 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లలో 168 ఎకరాలకు రూ.41.33 కోట్లు, మొత్తంగా 268 ఎకరాలకు గాను రూ.65.93 కోట్లుగా సీఆర్డీఏ నిర్ధారించింది. పేదలకు ఇచ్చేందుకు లైన్ క్లియర్ కావడంతో ఆర్ 5 జోన్ భూములను పేదలకు పంచేందుకు ఏపీ ప్రభుత్వం ఈనెల 18న ముహూర్తం పెట్టింది.
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కంటే ఐఫోన్లు ఖరీదైనవి అనే విషయం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…
Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్…
Husband Wife : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన…
Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్…
Mahesh Babu SS Rajamouli : భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా రాజమౌళి- మహేష్ చిత్రం…
Chandrababu : ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం విద్యా పరంగా కొత్త ప్రయోజనాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కూటమి…
This website uses cookies.