Balakrishna : సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో పాల్గొన్న బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఎన్టీఆర్ తయారు చేసిన ఎంతోమంది నాయకులు ఇప్పుడు ఇతర పార్టీలలో ముఖ్య నాయకులుగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరుతో 100 సంవత్సరాల క్రితం ఓ వెలుగు వెలిగిందని పేర్కొన్నారు. ఆ వెలుగు వెయ్యి సంవత్సరాలు వెలుగుతుందని చెప్పుకొచ్చారు. తెలుగువాడి ఆత్మాభిమానం, ఆత్మగౌరవంను నిలపెట్టింది ఎన్టీఆర్ అని బాలయ్య పేర్కొన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పథకాలు ఇంకా కొనసాగుతున్నాయని…
ఇప్పుడు అవ్వే పథకాలు పేర్లు మార్చి ఇప్పుడు నడిపిస్తున్నారని వివరించారు. అటువంటి ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని.. నందమూరి కుటుంబంతోపాటు అభిమానులు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు బాలకృష్ణ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉందన్నారు. తెలంగాణ టీడీపీ బలోపేతం కోసం తాను కూడా కష్టపడతానని బాలయ్య మాట ఇచ్చారు. ఆనాడు సామాన్యుడు కోసం ఎన్టీఆర్ సాహసవపేతమైన పథకాలు అమలు చేశారని స్పష్టం చేశారు. పేదలను రాజకీయాలకు పరిచయం చేసిన నేత అని అభివర్ణించారు.
మహిళల కోసం యూనివర్సిటీ స్థాపించారు ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు యువత ఎన్నో కార్యక్రమాలు కొనసాగించాలని బాలయ్య పిలుపునిచ్చారు. తాను ఆంధ్రాలో ఎమ్మెల్యే అయినా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు. కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తనను అతిథిగా సంబోధించడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఏదిఏమైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.