Home » Andhra Pradesh » Key Remarks Of Mla Balakrishna In Secunderabad Parliament Mini Mahanadu
andhra pradesh

Balakrishna : సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: May 10, 2023, 6:45 pm
Advertisement

Balakrishna : సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో పాల్గొన్న బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఎన్టీఆర్ తయారు చేసిన ఎంతోమంది నాయకులు ఇప్పుడు ఇతర పార్టీలలో ముఖ్య నాయకులుగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరుతో 100 సంవత్సరాల క్రితం ఓ వెలుగు వెలిగిందని పేర్కొన్నారు. ఆ వెలుగు వెయ్యి సంవత్సరాలు వెలుగుతుందని చెప్పుకొచ్చారు. తెలుగువాడి ఆత్మాభిమానం, ఆత్మగౌరవంను నిలపెట్టింది ఎన్టీఆర్ అని బాలయ్య పేర్కొన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పథకాలు ఇంకా కొనసాగుతున్నాయని…

Advertisement

Balakrishna is making the movie NBK 108 under the direction of Anil Ravipudi

ఇప్పుడు అవ్వే పథకాలు పేర్లు మార్చి ఇప్పుడు నడిపిస్తున్నారని వివరించారు. అటువంటి ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని.. నందమూరి కుటుంబంతోపాటు అభిమానులు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు బాలకృష్ణ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉందన్నారు. తెలంగాణ టీడీపీ బలోపేతం కోసం తాను కూడా కష్టపడతానని బాలయ్య మాట ఇచ్చారు. ఆనాడు సామాన్యుడు కోసం ఎన్టీఆర్ సాహసవపేతమైన పథకాలు అమలు చేశారని స్పష్టం చేశారు. పేదలను రాజకీయాలకు పరిచయం చేసిన నేత అని అభివర్ణించారు.

Advertisement

Key remarks of MLA Balakrishna in Secunderabad Parliament Mini Mahanadu

మహిళల కోసం యూనివర్సిటీ స్థాపించారు ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు యువత ఎన్నో కార్యక్రమాలు కొనసాగించాలని బాలయ్య పిలుపునిచ్చారు. తాను ఆంధ్రాలో ఎమ్మెల్యే అయినా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు. కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తనను అతిథిగా సంబోధించడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఏదిఏమైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి