
ap highcourt speeds up hearing on ap three capitals
ఏ రాష్ట్రంలో లేనట్టుగా.. ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. మూడు రాజధానుల ప్రకటన రాగానే.. కొందరు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అమరావతి రైతులు ఒకటే రాజధాని ఉండాలంటూ ఇప్పటికీ దీక్ష చేస్తున్నారు. మరోవైపు కొందరు మూడు రాజధానులపై హైకోర్టుకు ఎక్కారు.
ap highcourt speeds up hearing on ap three capitals
చాలా రోజుల నుంచి ఏపీ హైకోర్టులో మూడు రాజధానులకు సంబంధించిన కేసుల విచారణ సాగుతోంది. కానీ.. ఆ బిల్లుకు సంబంధించి ఏదీ కొలిక్కి రాలేదు.
దీంతో.. మూడు రాజధానుల అంశంపై దాఖలు అయిన సుమారు 90 పిటిషన్ల విచారణను వేగవంతం చేయాలని హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది.
అయితే.. ఇప్పటికే… ఆ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలు అయిన పిటిషన్లను విచారించిన కోర్టు.. ప్రభుత్వం తరుపున వాదనలను ప్రస్తుతం వింటోంది.
ఏపీ ప్రభుత్వం తరుపున.. సుప్రీం సీనియర్ లాయర్ దుష్యంత్ దేవ్ ఈ బిల్లుపై వాదిస్తున్నారు. ఇప్పటికే ఆయన మూడు రాజధానుల వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి. అభివృద్ధి ఏవిధంగా ఉంటుంది.. అనే దానిపై కోర్టుకు వివరించారు. అలాగే.. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని.. మూడు రాజధానులను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వాదించారు.
ఏపీ అభివృద్ధి కోసం.. ప్రజల దీర్ఘకాలిక అవసరాల కోసం.. ప్రయోజనాల కోసం, వారి సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం ఇది. అలాగే.. ఏపీ క్యాపిటల్ రీజిన్ డెవలప్ మెంట్ అథారిటీ చట్టాన్ని రద్దు చేస్తూ చేసిన చట్టం వల్ల అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు పరిరక్షింపబడుతాయి… అంటూ దుష్యంత్ ప్రభుత్వ వాదనలను వినిపించారు.
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
This website uses cookies.