Jagan – TDP : త్వరలోనే విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని సీఎం జగన్ చెబుతున్నారు. త్వరలోనే విశాఖ పాలనా రాజధాని అవుతుంది. వచ్చే సంవత్సరం ఈ సమయం వరకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కూడా స్పీడ్ పెంచింది. అందుకే.. ముందు మూడు రాజధానుల అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల శ్రీకాకుళం పర్యటనలోనూ సీఎం జగన్ అదే మాట చెప్పుకొచ్చారు. అధికార వికేంద్రీకరణలో భాగంగానే మూడు రాజధానులను ప్రకటించామని.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులను తీసుకొస్తున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
కానీ.. మూడు రాజధానుల అంశాన్ని కావాలని ప్రతిపక్ష పార్టీలు పెంట పెంట చేస్తున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల అంశం అంతా బూటకం అన్నాయి. విశాఖ రాజధాని అంశాన్ని ఇప్పుడు లేవనెత్తడం వెనుక వివేకా హత్య కేసు ఉందని.. ఆ హత్య కేసు నుంచి ఏపీ ప్రజల దృష్టి మరల్చడం కోసమే సీఎం జగన్.. ఇలా విశాఖ రాజధాని అంశాన్ని ఇప్పుడు లేవనెత్తారు అంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్న నేపథ్యంలో మంత్రి గుడివాడ అమరనాథ్.. ప్రతిపక్ష టీడీపీపై సీరియస్ అయ్యారు.
సీఎం జగన్ మంచి ఉద్దేశంతో రాజధాని విశాఖను చేస్తుంటే.. టీడీపీ, జనసేన విమర్శలు చేయడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పాలనా సౌలభ్యం కోసమే విశాఖ రాజధాని అని జగన్ చెప్పారని, దాని మీద ఎందుకు మాట్లాడరు అంటూ ఫైర్ అయ్యారు. అసలు.. విశాఖపట్టణం రాజధానికి టీడీపీ, జనసేన అనుకూలంగా ఉన్నారా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. అది చాలు అంటూ అమన్నాథ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో సీఎం ఎక్కడ నుంచి అయినా పాలించవచ్చు. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. విశాఖ నుంచి సీఎం జగన్ పాలిస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి. ఎందుకు ప్రతిపక్షాలు అంతలా ఉలిక్కి పడుతున్నాయి. అందరూ చూస్తుండగానే, విమర్శించే వారి కళ్ల ముందే విశాఖకు పాలన రాజధాని వస్తుంది.. అంటూ గుడివాడ అమర్నాథ్ టీడీపీని టార్గెట్ గా చేసుకొని విమర్శించారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.