strict measures taken in telangana govt in awake of covid third wave
KCR ఎప్పుడు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారో.. అప్పుడే ఈ బైపోల్ పై ఈసీ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ తోపాటే జరుగుతుందనుకున్న బైపోల్ … జరగలేదు.. కేసీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లారో లేదో .. వాయిదా అంటూ ప్రకటన వచ్చింది. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లగానే బైపోల్ షెడ్యూల్ ప్రకటన వచ్చేసింది. కేసీఆర్ హస్తినలో ఉన్నప్పుడే అకస్మాత్తుగా బైపోల్ నగారా మోగడం యాధృచ్చికమా? లేక.. అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గత నెలలో కేసీఆర్ వరుస ఢిల్లీ పర్యటనలతో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కేసీఆర్ రిక్వెస్ట్ మేరకే గత నెలలోనే రావాల్సిన ఎన్నికల షెడ్యూల్ రాలేదని అన్నారు. ఇప్పుడిక హుజురాబాద్ ఎలక్షన్ బెల్ మోగడంతో దీని వెనుక ఢిల్లీలో ఎలాంటి రాజకీయం నడిచిందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది.
kcr-telangana-dalit-bandhu
కేసీఆర్ విజ్ఞప్తి మేరకే హుజురాబాద్ ఎన్నికను కొన్నివారాల పాటు వాయిదా వేసి.. దళితబంధు పథకం అమలుకు ఓ రూపు తీసుకొచ్చాకే ఎన్నికల నగారా మోగించారంటూ ఓ ఆసక్తికర కథనం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ లోగా దళితబంధుతో పాటు ఈటల హీట్ కాస్త తగ్గించడం, కుల సంఘాల మీటింగులు, జంపింగ్ జపాంగ్ ల షిఫ్టింగులు, తాయిలాలు, పందేరాలు గట్రా కంప్లీట్ చేసుకున్న గులాబీ పార్టీ ఇక ఇక్కడ ఓకే అనగానే.. అక్కడ ఎలక్షన్ బెల్ మోగిందని అంటున్నారు. అంతేగాక టీఆర్ఎస్-బీజేపీల ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్ను భవిష్యత్తులో దెబ్బకొట్టేందుకు.. హుజురాబాద్ విషయంలో తాత్కాలికంగా కాంప్రమైజ్ కావాలని బీజేపీని కేసీఆర్ ఒప్పించారని అంటున్నారు. దీంతో ఢిల్లీ మంత్రాంగంలో పాపం ఈటల రాజేందర్ బలిపశువు అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇక మరో వాదన ప్రకారం
విసిరిన పాచికలు ఢిల్లీ పెద్దల దగ్గర బెడిసికొట్టాయని అంటున్నారు. కాలికి బలపం కట్టుకొని తిరిగినా.. కేంద్రం గులాబీ బాస్ ట్రాప్లో పడలేదని తెలుస్తోంది. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న కమలనాథులు.. కేసీఆర్తో అంటకాగేందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. ఈటల జేందర్లాంటి బలమైన నాయకుడు బీజేపీ తరఫున బరిలో ఉండడంతో ఎలాగైనా ఆయన్ను గెలిపించుకొని.. కేసీఆర్కు గట్టి ఝలక్ ఇవ్వాలని.. టీఆర్ఎస్కు బీజేపీనే ఆల్టర్నేట్ అనే మెసేజ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ ను గెలిపించుకొని.. టీఆర్ఎస్, కాంగ్రెస్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి.. కాషాయ జెండాను ఎగరేయాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకే, కమలదళాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు పెద్దగా కలిసిరాలేదని టాక్ వినిపిస్తోంది. అందుకే బైపోల్ నగారా మోగిందని చర్చ సాగుతోంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.