KCR : కెసిఆర్ ఎంత దగ్గరికి వెళ్తున్నా.. కేంద్రం ఎందుకు పట్టించకోవడం లేదు.. కెసిఆర్ కు ఇక మూడినట్టేనా

Advertisement
Advertisement

KCR ఎప్పుడు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారో.. అప్పుడే ఈ బైపోల్ పై ఈసీ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ తోపాటే జరుగుతుందనుకున్న బైపోల్ … జరగలేదు.. కేసీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లారో లేదో .. వాయిదా అంటూ ప్రకటన వచ్చింది. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లగానే బైపోల్ షెడ్యూల్ ప్రకటన వచ్చేసింది. కేసీఆర్ హ‌స్తిన‌లో ఉన్న‌ప్పుడే అక‌స్మాత్తుగా బైపోల్ న‌గారా మోగ‌డం యాధృచ్చిక‌మా? లేక‌.. అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

గత నెలలో కేసీఆర్ వ‌రుస‌ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌తో బీజేపీ పెద్ద‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కేసీఆర్ రిక్వెస్ట్ మేర‌కే గ‌త నెల‌లోనే రావాల్సిన ఎన్నిక‌ల షెడ్యూల్ రాలేద‌ని అన్నారు. ఇప్పుడిక హుజురాబాద్ ఎల‌క్ష‌న్‌ బెల్ మోగ‌డంతో దీని వెనుక ఢిల్లీలో ఎలాంటి రాజ‌కీయం న‌డిచింద‌నే అనుమానం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

Advertisement

kcr-telangana-dalit-bandhu

 

బెల్లు మోగడంపై కథనాలు షురూ KCR

కేసీఆర్ విజ్ఞ‌ప్తి మేర‌కే హుజురాబాద్ ఎన్నిక‌ను కొన్నివారాల పాటు వాయిదా వేసి.. ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లుకు ఓ రూపు తీసుకొచ్చాకే ఎన్నిక‌ల న‌గారా మోగించార‌ంటూ ఓ ఆసక్తికర కథనం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ లోగా ద‌ళిత‌బంధుతో పాటు ఈట‌ల హీట్ కాస్త త‌గ్గించ‌డం, కుల సంఘాల మీటింగులు, జంపింగ్ జ‌పాంగ్ ల షిఫ్టింగులు, తాయిలాలు, పందేరాలు గ‌ట్రా కంప్లీట్ చేసుకున్న గులాబీ పార్టీ ఇక ఇక్క‌డ ఓకే అన‌గానే.. అక్క‌డ ఎల‌క్ష‌న్ బెల్ మోగిందని అంటున్నారు. అంతేగాక టీఆర్ఎస్‌-బీజేపీల ఉమ్మ‌డి శ‌త్రువైన కాంగ్రెస్‌ను భ‌విష్య‌త్తులో దెబ్బ‌కొట్టేందుకు.. హుజురాబాద్ విష‌యంలో తాత్కాలికంగా కాంప్ర‌మైజ్ కావాల‌ని బీజేపీని కేసీఆర్ ఒప్పించార‌ని అంటున్నారు. దీంతో ఢిల్లీ మంత్రాంగంలో పాపం ఈట‌ల రాజేంద‌ర్ బ‌లిప‌శువు అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

పట్టు బిగించిన కమలనాథులు KCR

ఇక మ‌రో వాద‌న ప్రకారం

విసిరిన పాచిక‌లు ఢిల్లీ పెద్ద‌ల ద‌గ్గ‌ర‌ బెడిసికొట్టాయ‌ని అంటున్నారు. కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని తిరిగినా.. కేంద్రం గులాబీ బాస్ ట్రాప్‌లో ప‌డ‌లేద‌ని తెలుస్తోంది. తెలంగాణ‌లో సొంతంగా అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న క‌మ‌ల‌నాథులు.. కేసీఆర్‌తో అంట‌కాగేందుకు స‌సేమిరా అన్న‌ట్టు స‌మాచారం. ఈట‌ల జేంద‌ర్‌లాంటి బ‌ల‌మైన నాయ‌కుడు బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో ఉండ‌డంతో ఎలాగైనా ఆయ‌న్ను గెలిపించుకొని.. కేసీఆర్‌కు గ‌ట్టి ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని.. టీఆర్ఎస్‌కు బీజేపీనే ఆల్ట‌ర్‌నేట్ అనే మెసేజ్‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని భావిస్తోంది. భారీ మెజార్టీతో ఈట‌ల‌ రాజేందర్ ను గెలిపించుకొని.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల‌కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి.. కాషాయ జెండాను ఎగ‌రేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది బీజేపీ. అందుకే, క‌మ‌ల‌ద‌ళాన్ని ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నాలు పెద్దగా కలిసిరాలేదని టాక్ వినిపిస్తోంది. అందుకే బైపోల్ నగారా మోగిందని చర్చ సాగుతోంది.

Advertisement

Recent Posts

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!

Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…

17 minutes ago

Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?

Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…

1 hour ago

Saree Viral Video : ఓహ్..ఈ టైపు చీరలు కూడా వచ్చాయా..? దేవుడా..?

Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…

2 hours ago

Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్- లావణ్య కేసులో సంచలన ట్విస్ట్..!

Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…

3 hours ago

Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

Chandrababu  : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…

4 hours ago

Yellamma Movie : రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ వేణు.. ఎల్ల‌మ్మ‌పై భారీ అంచ‌నాలు..!

Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్ర‌స్తుతం…

5 hours ago

Ac Settings : సమ్మర్ లో ఏసీ ప్రమాదాలు… దీనికి కారణం ఇవేనంట…?

Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…

6 hours ago

Ishant Sharma : ఇషాంత్ శ‌ర్మ‌లో ఫైర్ త‌గ్గలేదు.. అత‌నితో డిష్యూం డిష్యూం

Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…

7 hours ago