
Chandra babu naidu and nara lokesh only focusing on media publicity
Nara Lokesh : ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలని తెలుగు దేశం పార్టీ తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తోంది. తమకు చెందిన మీడియా, తమకు అనుకూలంగా రాసే మీడియాలో తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ప్రమోషన్ ను చేసుకుంటూ ఉంటున్నారు. కాని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాని ఆయన తనయుడు లోకేష్ కాని ఇతర తెలుగు దేశం పార్టీ నాయకులు కాని ప్రజల్లోకి వెళ్లడం లేదు అనేది విమర్శ. ప్రజల్లోకి వెళ్లకుండా గతంలో ఎవరు అధికారం దక్కించుకున్న దాఖలాలు లేవు. గతంలో రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా అంతా కూడా అధికారం దక్కించుకునేందుకు జనాల్లోకి వెళ్లారు.
Chandra babu naidu and nara lokesh only focusing on media publicity
తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ మొదటి నుండి కూడా జనాల్లో ఎక్కువ ఉండటం కంటే పబ్లిసిటీ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఎక్కువగా మీడియాలో కనిపించేందుకు ప్రాముఖ్యత ఇచ్చేవాడు. ఇప్పటికి కూడా ఆయన జనాల్లోకి వెళ్లేందుకు సిద్దంగా లేడు అనడంలో సందేహం లేదు. అలాంటి నారా లోకేష్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని గెలిపించి తీరుతామంటూ ఆయన బీరాలు పలుకుతున్నాడు. ఆయన మాటలు చూస్తుంటే విడ్డూరంగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Chandra babu naidu and nara lokesh only focusing on media publicity
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పదే పదే మీడియాలో విమర్శిస్తూ నారా లోకేష్ జనాల్లో పాపులారిటీని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇలా ఎంత వరకు సాధ్యం అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల మనిషి అని ప్రజల్లో ఆయన గురించి ఉన్న అభిమానం మరియు అభిప్రాయంను దెబ్బ తీయడం ఎవరి వల్ల కాదంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే నారా లోకేష్ జనాల్లోకి వెళ్లి ప్రజా వ్యతిరేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని నిరూపిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో ఏమైనా తెలుగు దేశం పార్టీ ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Ustaad Bhagat Singh Movie Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan , మాస్ డైరెక్టర్…
Hyderabad Girls : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు లోకం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్టే…
Ustaad Bhagath singh :టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం ఒక రకమైన క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడనే చెప్పాలి.…
Malkajgiri : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున “రంజాన్…
Iran And India : ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికించేలా ఉన్నాయి.…
Telangana : తెలంగాణలో బీసీలపై అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ…
Revanth Reddy : క్వింటల్ కొద్దీ ఆరోపణలు, టన్నుల కొద్దీ విమర్శలు.. ప్రస్తుతం తెలంగాణ Telangana రాజకీయాల్లో Harish rao …
Pawan Kalyan : సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది పండగ…
Rithu Bharosa : యాసంగి సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం నిరాటంకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.…
Induction stove : ప్రస్తుతం ఎక్కువ మంది గ్యాస్ స్టౌవ్లకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ కుక్టాప్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.…
Farmers : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని…
Gold Silver Price 18th March 2026 : పండుగ సీజన్ వస్తుందంటే చాలు, తెలుగు లోగిళ్లలో పసిడి కొనుగోళ్లు…
This website uses cookies.