chandrababu naidu : ఏపీ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక వైపు బీజేపీ రాష్ట్రంలో జనసేన పార్టీతో కలిసి పాగా వేయాలని భావిస్తుంది. మరో వైపు వచ్చే సారి అయినా తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నాడు. ఇక వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవ్వాలని వైకాపాను మరింత బలంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు అన్నట్లుగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాని కొన్ని సార్లు ముందు ఉన్న అవకాశంను వదిలేసి ఏదో విషయాన్ని పట్టుకుని వేలాడటం జరుగుతుంది. ఈ విషయం ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందని అంటున్నారు.
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. అలాంటి ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేపట్టేందుకు సిద్దం అయ్యింది. ఇలాంటి సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా బీజేపీపై తిరగబడే ప్రయత్నం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడంతో పాటు తన ఎంపీలతో పార్లమెంట్ లో దద్దరిల్లేలా చేశారు. దాంతో వైఎస్ జగన్ కు ఈ విషయంలో మైలేజ్ దక్కినట్లు అయ్యింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధ్యం అయినంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాం అంటూ ప్రకటన చేశాడు. కాని చంద్రబాబు నాయుడు మాత్రం ఆ విషయంలో పెద్దగా స్పందన లేకుండా ఉన్నాడు. ట్విట్టర్ లో కాస్త హడావుడి చేసి అక్కడ నుండి కనిపించడం లేదు అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రధాన కారణం నష్టాలు అంటూ చెబుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. ఇలాంటి సమయంలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు మోడీపై విరుచుకు పడాలి. ఆయన్ను చీల్చి చెండాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రంపై కంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువగా విమర్శలు చేస్తున్నాడు. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు విషయమై టీడీపీ ఆశలు పెట్టుకుంది. అందుకే చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంను కాకుండా రాష్ట్ర ప్రభుత్వంను టార్గెట్ చేస్తున్నాడు. రాష్ట్రంలో వైకాపాను టార్గెట్ చేయడం వల్ల తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు వెళ్లువెత్తడం తప్ప మరేం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.