CM Jagan : సీఎం జగన్ బీసీల‌కు ఇచ్చిన‌ ప్రతి హామీ మాటను నెరవేర్చారు

CM Jagan : డిసెంబరు 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం బీసీలకు డీబీటీ ద్వారా మూడున్నరేళ్ళలో రూ. 86 వేల కోట్లు చెప్పిన హామీలతో పాటు చెప్పనివి కూడా అమలు చేస్తున్న నాయకుడు జగన్ బీసీలలో ‘క్విట్ బాబూ’ నినాదం మారుమోగుతోంది: బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల బీసీ ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి బాటలు వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అన్నారు. శనివారం తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో జరిగిన బీసీ ముఖ్యనేతల భేటీ లో బీసీ మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, గుమ్మనూరు జయరాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబరు 8వ తేదీన బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించినట్లు నేతలు వెల్లడించారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్ ని ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

సీఎం జగన్ మూడున్నరేళ్ళ పరిపాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలును గుర్తు చేసుకుంటూ, గ్రామ సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ బీసీ ప్రజాప్రతినిధులంతా కలిసి, ఒక పండుగ వాతావరణంలో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అన్ని పదవుల్లో బీసీలేకే ప్రాధాన్యం : మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ 56 కార్పొరేషన్లు, 672 మంది డైరెక్టర్లు, 122 ప్రభుత్వ కార్పొరేషన్లలో బీసీ కులాలకు సంబంధించిన వారిని నియమించడం జరిగిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పడి రెండేళ్ళు పూర్తవుతుందని, ఈ నేపథ్యంలోనే బీసీల ఆత్మీయ కలయిక సమ్మేళనం నిర్వహించాలని అనుకున్నామని చెప్పారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ల ఛైర్మెన్లు, మెంబర్లు, ఆలయ కమిటీల ఛైర్మన్లు, డైరెక్టర్లు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మెన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యుల వరకు.. అందర్నీ ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తామని తెలిపారు.

CM Jagan has fulfilled every word said in the BC declaration

చంద్రబాబు హయాంలో కుల వృత్తులు చేసుకునే వారికి పనికిరాని పనిముట్లు ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రభుత్వం తమది కాదని అన్నారు. బీసీల అవసరాలను గుర్తించి…వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ అని వివరించారు. దేశంలో బీసీలకు పెద్ద పీట వేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: మంత్రి గుమ్మనూరు జయరాం రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా, బీసీలను గుర్తించి, మేలు చేసింది జగనన్న కాబట్టి.. బీసీ సమాజం అంతా ఆయనకు అండగా నిలబడుతున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటే.. బీసీల రాష్ట్రంగా నిలిచింది మాత్రం ఆంధ్రప్రదేశ్ అని అందరూ చెబుతున్నారని, ఇది చారిత్రాత్మక సంస్కరణలు అని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి దిశ, దశ నిర్దేశించిన నాయకుడు జగన్: బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గత ఎన్నికలకు ముందే, తన సుదీర్ఘ పాదయాత్రలో బీసీల స్థితిగతులను గుర్తించి,

వారి జీవన ప్రమాణాలపై ఒక కమిటీ వేసి అధ్యయనం చేయించిన నాయకుడు జగన్ అని అన్నారు.  ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి అంశాన్నీ ఈ ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని తెలిపారు. డిక్లరేషన్ లో పొందుపరిచిన అంశాలతో పాటు, చెప్పని కొత్త అంశాలను కూడా చేర్చి, సీఎం జగన్ అమలు చేస్తున్నారాని అన్నారు. బీసీల సంక్షేమ సారధి జగన్: ఎంపీ మార్గాని భరత్ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎవర్నీ కలవడం అవసరం లేకుండా బీసీలకు సంక్షేమ పథకాల ద్వారా.. ఒక్క బటన్ తో రూ. 86 వేల కోట్లు మూడున్నరేళ్ళలో ఇచ్చారని అన్నారు. చంద్రబాబు బీసీలకు చేసిన మేలు ఏమిటో చెప్పలగరాని ఎంపీ ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యేలు కె. పార్థసారథి, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరైయ్యారు.

Recent Posts

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో…

9 hours ago

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే…

9 hours ago

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…

10 hours ago

Warangal Congress : వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతుంది.. కొండా దంపతులు vs ఐదుగురు ఎమ్మెల్యేలు

Warangal Congress : కాంగ్రెస్‌ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్‌…

11 hours ago

RK Roja : గబ్బర్ సింగ్ ఇప్పుడు రబ్బర్ సింగ్ అయ్యాడు.. పవన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో

RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…

12 hours ago

Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ లేవు బోర్డు..!

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…

13 hours ago

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…

14 hours ago

Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్… కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…

15 hours ago