Ysr Kalyanamastu : నేడు వైయస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫా పథకాలు అమలు చేయనున్న సీఎం జగన్.. ఎవరికి వర్తిస్తుందో ఫుల్ డీటెయిల్స్..!!

Advertisement
Advertisement

Ysr Kalyanamastu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్..ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని దాదాపు 90 శాతానికి పైగా అమలు చేస్తూ ఉన్నారు. విభజనతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిన కేంద్రం సహకరించకపోయినా.. ఉన్నదానిలోనే సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటూ పరిపాలన ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రారంభంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అమలు చేయకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ ప్రతిపక్షాలకు ఇవ్వకుండా ఈరోజు ఈ హామీ నెరవేర్చడానికి వైయస్ జగన్ ప్రభుత్వం రెడీ అయింది.

Advertisement

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 11 గంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకం ఆర్థిక సాయాన్ని నేడు ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. నేరుగా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో వెళ్లేలా బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.గత ఏడాది అక్టోబర్ మొదటి తారీకు నుంచి డిసెంబర్ 31 వ తారీకు వరకు వివాహాలు చేసుకున్న యువతులకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 4,536 మంది లబ్ధిదారులకు 38.18 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు. అయితే ఈ పథకం మొదటి పెళ్లి చేసుకున్న వారికి మాత్రమే. పెళ్లయి 60 రోజులలోపు అర్హులైన వారు వైయస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫాకి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వాళ్లు సంబంధిత పత్రాలతో గ్రామ వార్డు సచివాలయాలలో ఇతర వివరాలను తెలియజేసి దరఖాస్తు చేసుకోవాలి. పేదింటి యువతకు గౌరవప్రదంగా వివాహం జరిపేందుకు ఈ పథకం తీసుకొచ్చినట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

Ysr Kalyanamastu

ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, బీసీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. వైయస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. ఇదే సమయంలో ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు కులాంతర వివాహం చేసుకుంటే లక్ష ఇరవై వేల రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలకు 50,000 కులాంతర వివాహం చేసుకుంటే ₹75,000 కానుకగా ఇస్తారు. భవన నిర్మాణ కార్మికులకు 40 వేల రూపాయలు, మైనారిటీల వివాహాలకు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద లక్ష, దివ్యాంగుల వివాహాలకు రూ. లక్షా 50వేల రూపాయలు కానుకగా ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది.

పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి…కన్న తల్లిదండ్రులకు భారం కాకుండా వైసిపి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ పథకానికి కొన్ని నిబంధనలు కూడా వైసీపీ ప్రభుత్వం పెట్టడం జరిగింది. వైయస్సార్ కళ్యాణమస్తు పథకం అప్లై చేసుకునే అమ్మాయి వయసు 18 ఏళ్లు, అబ్బాయి వయసు 21 ఏళ్లు, అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఖచ్చితంగా కనీసం పదోతరగతి చదివి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలకు వర్తించదు. ఇంకా నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 10వేలు, పట్టణ ప్రాంతాలలో 12 వేలకు మించకుండా ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తది. మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు మాత్రమే అర్హులు. ఇంక నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు అనర్హులు. కానీ ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో ఆదాయపు పన్ను చెల్లించేవాళ్లు, ఇంట్లో 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం చేసేవారు కూడా అనర్హుల జాబితా లెక్కలో తేల్చారు. నేడు ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

8 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

9 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

10 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

11 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

12 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

13 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

14 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

15 hours ago

This website uses cookies.