KCR : ఉగాది తర్వాత కేసీఆర్ పర్యటన.. చిన్నపాటి పాదయాత్రే? నష్టాన్ని పూడ్చుకోవడానికేనా?

Advertisement
Advertisement

KCR తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ గడ్డుపరిస్థితులను ఎదుర్కుంటోంది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తే.. టీఆర్ఎస్ పార్టీ గెలవడం కష్టమే. తెలంగాణలో అతివేగంగా బీజేపీ పార్టీ దూసుకుపోతోంది. జెట్ స్పీడ్ లో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసితో ఉంది బీజేపీ. అందుకు తగ్గ ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నారు బీజేపీ నేతలు.

Advertisement

cm kcr to talk to telangana people after ugadi

ఇలాగే చూస్తూ కుర్చుంటే.. కూర్చున్న సీటును కూడా లాక్కొని వెళ్లేలా ఉన్నారు బీజేపీ వాళ్లు.. అని అనుకొని సీఎం కేసీఆర్ వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో వెంటనే కేసీఆర్ కూడా అప్రమత్తమయ్యారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎలా గెలిపించాలి… భవిష్యత్తులో మరోసారి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోకుండా ఏం చేయాలి? అనే దానిపై మేథోమథనం చేస్తున్నారు.

Advertisement

భవిష్యత్తులో చాలా ఎన్నికలు తెలంగాణలో రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో గెలవాలన్నా.. టీఆర్ఎస్ పార్టీని మళ్లీ ప్రజలు నమ్మాలన్నా.. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి.. అనే దానిపైనే టీఆర్ఎస్ హైకమాండ్ లో సందిగ్దత నెలకొన్నది.

ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసమే : KCR

అందుకే.. సీఎం కేసీఆర్ ఉగాది తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారట. ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టాలను తెలుసుకుంటే బెటర్ అనే భావనలో ఉన్నారట. వాళ్ల సమస్యలేంటో తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తే కొంతలో కొంతైనా ప్రజలు కేసీఆర్ ను నమ్మే చాన్స్ ఉంది. ఆ చాన్స్ ను ఎందుకు వదులుకోవాలి.. అన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ముందు వరంగల్, కరీంనగర్ పర్యటన

నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ బలం ఉన్నది అంటే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో. కానీ.. అది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం తగ్గుతోంది. అందుకే.. ముందుగా వరంగల్, కరీంనగర్ జిల్లాల పర్యటన చేయడానికి కేసీఆర్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి.. అంటే ఇది ఒక చిన్నపాటి పాదయాత్ర అని కూడా అనుకోవచ్చు.. క్షేత్రస్థాయి పర్యటన చేసి.. ఆ పర్యటన ద్వారా ప్రజలతో మమేకం అయి మళ్లీ వాళ్ల నమ్మకాన్ని పొంది.. వచ్చే ఎన్నికల్లో మరోసారి అప్రతిహాతంగా గెలవాలన్నదే కేసీఆర్ ప్లాన్.

మరి.. ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

26 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

1 hour ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

2 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

3 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

4 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

5 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

6 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

7 hours ago

This website uses cookies.